మామిడికాయ పులిహోర
- March 17, 2018కావలసినవి:
బియ్యం- ఒక కప్పు, పచ్చిమామిడికాయ తరుగు- ఒక కప్పు, ఉప్పు-తగినంత, పసుపు-1/8 టీస్పూను.
తాలింపు కోసం:
నువ్వులనూనె- మూడు టేబుల్స్పూన్లు, ఆవాలు- అర టీస్పూను, మినపప్పు-రెండు టీస్పూన్లు, శెనగపప్పు- ఒక టేబుల్స్పూను, కరివేపాకు-గుప్పెడు, ఇంగువ-చిటికెడు, అల్లం- చిన్నముక్క (తరిగి), పల్లీలు-మూడు టేబుల్స్పూన్లు, పచ్చిమిర్చి-మూడు (సన్నగా, పొడుగ్గా తరిగి), ఎండుమిర్చి- మూడు.
తయారీవిధానం:
బియ్యంలో సరిపడా నీళ్లు పోసి ఉడికించాలి. ఉడికిన అన్నాన్ని పెద్ద పళ్లెంలో పోసి పైన ఒక టీస్పూను నువ్వుల నూనె చల్లాలి. పల్లీలను నూనె వేయకుండా వేగించి పొట్టు తీసేయాలి. కళాయిలో నూనె వేడి చేసి ఆవాలు వేయాలి. అవి చిటపటలాడేటప్పుడు మినపప్పు, శెనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ, పల్లీలు వేసి వేగించాలి. ఆ తర్వాత అల్లం తరుగు కూడా వేసి కొంచెంసేపు వేగించాలి. ఆ తర్వాత పసుపు, మామిడి తరుగును వేసి మూడు నిమిషాలు గరిటెతో అటు ఇటు తిప్పాలి. ఆ తరువాత ఉప్పు వేయాలి. ఈ తాలింపును అన్నంలో వేసి అంతా బాగా కలిసేలా కలపాలి.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?