రంగమ్మత్తకు తప్పని పాట్లు
- March 19, 2018చిన్న చిన్న అంశాలలో తనను టార్గెట్ చేసుకుని నెటిజన్లు తీవ్ర విమర్శలు చేయడంతో కలత చెందిన హాట్ యాంకర్ అనసూయ, సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే. కొన్నాళ్ళుగా దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మళ్ళీ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది. "రంగస్థలం" సినిమాలో పోషించిన రంగమ్మత్త క్యారెక్టర్ తో కూడిన ఫోటోను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలోకి వచ్చిన అనసూయపై నెటిజన్ల తీరు మారకపోవడం విశేషం.
'సెల్ ఫోన్ కొనిచ్చారా? లేదా? ముందు అది చెప్పండి' అని కొందరు. 'అనసూయ ఆంటీ' అని మరికొందరు. 'మేకప్ లేనిదే చూడలేమని' ఇంకొందరు విమర్శల వెల్లువ కొనసాగిస్తున్నారు. మధ్యలో కాస్త విరామం తీసుకున్నా. తన పట్ల నెటిజన్ల తీరు మారలేదని ఈ పాటికే అనసూయకు అర్ధమై ఉంటుంది. కాబట్టి వారి వ్యాఖ్యలను ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటే, అనసూయకు కూడా ఇబ్బంది ఉండదు. పబ్లిక్ ఫ్లాట్ ఫాంలో ఉన్నపుడు తలో మాట మాట్లాడడం సహజం.
వాటిని వ్యక్తిగతంగా తీసుకుని, మైండ్ లోకి ఎక్కించుకుంటే చివరికి మానసిక క్షోభ అనసూయకే గానీ, నెటిజన్లకు కాదు. అందరికీ మనం నచ్చేయాలి, అందరూ పొగిడేయాలని అనుకోవడం మన తప్పే. సెలబ్రిటీగా ఉన్నపుడు పొగడ్తలు ఎలా వస్తాయో, విమర్శలు అంతకు మించిన స్థాయిలో ఉంటాయి. పెద్ద పెద్ద హీరోలకే ఇవి తప్పడం లేదు. మరి అనసూయ వంటి యాంకర్లు ఇందుకు మినహాయింపు కోరుకోవడం అత్యాశే అవుతుంది. ఎందుకంటే నేడు సోషల్ మీడియా అలా తయారయ్యింది!
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం