యూఏఈలో రెండేళ్ళ చిన్నారిని చిదిమేసిన బస్సు
- March 19, 2018
యూఏఈ:2 ఏళ్ళ ఎమిరేటీ చిన్నారిపై నుంచి స్కూల్ బస్ దూసుకెళ్ళడంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అల్ ధైద్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన ఇంటికి దగ్గర్లోనే ఆ చిన్నారి ఆడుకుంటుంటడగా ఈ ఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. మధ్యాహ్నం 2.45 నిమిషాల సమయంలో ఆపరేషన్ రూమ్కి ఈ ఘటనపై సమాచారం అందింది. హుటాహుటిన అంబులెన్స్ టీమ్, పెట్రోల్స్, ట్రాఫిక్ ఎక్స్పర్ట్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సమీపంలోని నర్సరీలో చదువుతున్న సయీద్గా మృతుడ్ని నిర్ధారించారు. అల్ ధైద్ హాస్పిటల్కి మృతదేహాన్ని తరలించారు. తల్లిదండ్రులు, వాహనదారులు చిన్నారుల విషయంలో అప్రమత్తంగా వుండాలనీ, రెసిడెన్షియల్ ఏరియాల్లో వాహనాలు నడిపేటప్పుడు నెమ్మదిగా వెళ్ళాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, జోర్డాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..సర్వదర్శనానికి 18 గంటల సమయం
- రెస్టారెంట్ పై పరువునష్టం కలిగించే వీడియో..
- బహ్రెయిన్ పై ఇరాన్ వైమానిక దాడులు విఫలం.. క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేసిన రక్షణ దళాలు
- ఎలక్ట్రిక్ బైక్ వల్ల భారీ అగ్నిప్రమాదం..
- భారతీయులకు శుభవార్త..56 దేశాలకు వీసా లేకుండానే ట్రావెల్..!!
- కువైట్లో ఆన్లైన్ డెలివరీ రంగానికి కొత్త నిబంధనలు..!!
- అల్-అహ్సాలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు..!!
- ఖతార్ సహా గల్ఫ్ దేశాల గగనతలంపై ఈయూ వార్నింగ్..!!
- రూ.100కు చేరువలో డాలర్.. ప్రవాసులకు భారీ లాభం..!!







