యూఏఈలో రెండేళ్ళ చిన్నారిని చిదిమేసిన బస్సు
- March 19, 2018
యూఏఈ:2 ఏళ్ళ ఎమిరేటీ చిన్నారిపై నుంచి స్కూల్ బస్ దూసుకెళ్ళడంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అల్ ధైద్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన ఇంటికి దగ్గర్లోనే ఆ చిన్నారి ఆడుకుంటుంటడగా ఈ ఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. మధ్యాహ్నం 2.45 నిమిషాల సమయంలో ఆపరేషన్ రూమ్కి ఈ ఘటనపై సమాచారం అందింది. హుటాహుటిన అంబులెన్స్ టీమ్, పెట్రోల్స్, ట్రాఫిక్ ఎక్స్పర్ట్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సమీపంలోని నర్సరీలో చదువుతున్న సయీద్గా మృతుడ్ని నిర్ధారించారు. అల్ ధైద్ హాస్పిటల్కి మృతదేహాన్ని తరలించారు. తల్లిదండ్రులు, వాహనదారులు చిన్నారుల విషయంలో అప్రమత్తంగా వుండాలనీ, రెసిడెన్షియల్ ఏరియాల్లో వాహనాలు నడిపేటప్పుడు నెమ్మదిగా వెళ్ళాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









