యూఏఈలో రెండేళ్ళ చిన్నారిని చిదిమేసిన బస్సు
- March 19, 2018యూఏఈ:2 ఏళ్ళ ఎమిరేటీ చిన్నారిపై నుంచి స్కూల్ బస్ దూసుకెళ్ళడంతో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అల్ ధైద్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన ఇంటికి దగ్గర్లోనే ఆ చిన్నారి ఆడుకుంటుంటడగా ఈ ఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. మధ్యాహ్నం 2.45 నిమిషాల సమయంలో ఆపరేషన్ రూమ్కి ఈ ఘటనపై సమాచారం అందింది. హుటాహుటిన అంబులెన్స్ టీమ్, పెట్రోల్స్, ట్రాఫిక్ ఎక్స్పర్ట్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సమీపంలోని నర్సరీలో చదువుతున్న సయీద్గా మృతుడ్ని నిర్ధారించారు. అల్ ధైద్ హాస్పిటల్కి మృతదేహాన్ని తరలించారు. తల్లిదండ్రులు, వాహనదారులు చిన్నారుల విషయంలో అప్రమత్తంగా వుండాలనీ, రెసిడెన్షియల్ ఏరియాల్లో వాహనాలు నడిపేటప్పుడు నెమ్మదిగా వెళ్ళాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ