ట్రక్కుని ఢీ కొన్న బస్సు ఘటనలో ఇద్దరు మృతి, 26 మందికి గాయాలు
- March 21, 2018మక్కా : 50 మంది ప్రయాణీకులతో వెళుతున్నబస్సు ఒక ట్రక్కుని ' ఢీ ' కొట్టిన ఘటనలో మక్కాలోని జామౌమ్ సమీపంలోని అల్-క్వైయ్యా రహదారిపై కరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో బస్సు డ్రైవర్ తో సహా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. సివిల్ డిఫెన్స్ ప్రతినిధి మేజ్ నయిఫ్ అల్-షరీఫ్ మాట్లాడుతూ బస్సు డ్రైవర్ సహాయకుడి తో సహా చనిపోయినట్లు తెలిపారు. ఈ ప్రమాదం జరిగినపుడు 26 మంది ప్రయాణికులు గాయపడ్డారు, వీరినందరిని మక్కాలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. బస్సు లోపల ప్రయాణికులు చిక్కుకున్నట్లు సమాచారం పొందిన తర్వాత సివిల్ డిఫెన్స్ బృందాలు ప్రమాదస్థలానికి చేరుకొన్నారు. ఇనుమును కత్తిరించే సాధనాలను ఉపయోగించి పలువురిని వెలుపలకు తీసి రక్షించారు. వీరికి ప్రథమ చికిత్స అందించినట్లు ఆరోగ్య వ్యవహారాలు మరియు సౌదీ రెడ్ క్రెసెంట్ అథారిటీల బృందాల సహాయంతో రక్షణ చర్యలు చేపట్టినట్లు ఆ ప్రతినిధి చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..