బొకోహరమ్ చెర నుంచి బాలికలకు విముక్తి
- March 21, 2018
అబూజా: ఫిబ్రవరిలో కిడ్నాప్ చేసిన బాలికలను బొకోహారం ఉగ్రవాదులు బుధవారం విడుదల చేశారు. ఈశాన్య డాప్సి పట్టణంలో బొకోహారం ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన వారిలో 76 మంది బాలికలు సురక్షితంగా విడుదలయ్యారని సమాచార శాఖ మంత్రి లారు మహ్మద్ వెల్లడించారు. బొకోహారం ఉగ్రవాదులు, నైజీరియన్ ప్రభుత్వానికి మధ్య చర్చలు సఫలం కావడంతో తీవ్రవాదులు బాలికలను విడిచిపెట్టారని తెలిపారు. కొంతమంది మిత్రుల సాయంతో కిడ్నాప్నకు గురైన బాలికలను సురక్షితంగా కాపాడామని పేర్కొన్నారు. అయితే బొకోహారం తీవ్రవాదులు ఎవరికి అవకాశం ఇవ్వకుండా బాలికలను కిడ్నాప్ చేసిన స్కూల్ దగ్గర వదిలిపెట్టి వెళ్లారని కిడ్నాప్నకు గురైన బాలికల తల్లిదండ్రుల గ్రూప్నకు చెందిన వ్యక్తి ఒకరు తెలిపారు. బాలికలను వాహనాల్లో తీసుకువచ్చి స్కూల్ వద్ద వదిలి వెళ్లినట్టు తెలిపారు. నైజీరియాతోపాటు లేక్ ఛాడ్ ప్రాంతాల్లో బొకోహారం ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను కొనసాగించేందుకు అవసరమైన నిధుల కోసం కిడ్నాప్ను అస్త్రంగా వాడుకొని ప్రభుత్వంపై బెదిరింపులకు పాల్పడ్డారు. మొత్తం 110 మంది బాలికలు కిడ్నాప్ అయ్యారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే నైజీరియా అధికారులు మాత్రం ఎంతమంది బాలికలు కిడ్నాప్నకు గురయ్యారనే విషయంపై ఆరా తీస్తున్నారు.
తాజా వార్తలు
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







