మసీదుల్లో నక్కి కాల్పులు జరిపిన ఉగ్రవాదులు
- March 21, 2018
జమ్మూ కాశ్మీర్లో కుప్వారా జిల్లా కాల్పుల మోతతో దద్దరిల్లింది. రెండు రోజులుగా జరిగిన భీకర ఎన్ కౌంటర్ లో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. ఐదుగురు ఉగ్రవాదులను మన సైన్యం అంతం చేసింది. హల్మాత్పొరా ప్రాంతంలో ఉగ్రవాదులు బీఎస్ఎఫ్, సైన్యం కళ్లుగప్పి నియంత్రణ రేఖను దాటారు. షంసాబారి పర్వత శ్రేణులు దాటి 8 కిలోమీటర్లు ముందుకొచ్చారు. అప్పటికే అక్కడున్న మరికొందరు ఉగ్రవాదులతో కలిసి కుప్వారా పట్టణంవైపు వస్తుండగా మంగళవారం ఉదయం స్థానిక పోలీసులు గమనించారు. పోలీసులను చూసి ఉగ్రవాదులు అటవీ ప్రాంతంలోకి పారిపోయేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, సైన్యం, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా వారిపై ఎదురుదాడికి దిగారు.
మంగళవారం ఉదయం మొదలైన భీకర ఎన్కౌంటర్ సుమారు 48 గంటల పాటు కొనసాగింది. ఉగ్రవాదులు స్థానిక మసీదుల్లో నక్కి భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. భద్రతా దళాలు మంగళవారమే నలుగురు ముష్కరులను మట్టుబెట్టాయి. ఐదో ఉగ్రవాదిని బుధవారం హతమార్చాయి. ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు భద్రతా సిబ్బంది కూడా మరణించారు. వీరిలో ఇద్దరు పోలీసులు, ముగ్గురు జవాన్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఓ సైనికుడు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం







