మసీదుల్లో నక్కి కాల్పులు జరిపిన ఉగ్రవాదులు
- March 21, 2018
జమ్మూ కాశ్మీర్లో కుప్వారా జిల్లా కాల్పుల మోతతో దద్దరిల్లింది. రెండు రోజులుగా జరిగిన భీకర ఎన్ కౌంటర్ లో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. ఐదుగురు ఉగ్రవాదులను మన సైన్యం అంతం చేసింది. హల్మాత్పొరా ప్రాంతంలో ఉగ్రవాదులు బీఎస్ఎఫ్, సైన్యం కళ్లుగప్పి నియంత్రణ రేఖను దాటారు. షంసాబారి పర్వత శ్రేణులు దాటి 8 కిలోమీటర్లు ముందుకొచ్చారు. అప్పటికే అక్కడున్న మరికొందరు ఉగ్రవాదులతో కలిసి కుప్వారా పట్టణంవైపు వస్తుండగా మంగళవారం ఉదయం స్థానిక పోలీసులు గమనించారు. పోలీసులను చూసి ఉగ్రవాదులు అటవీ ప్రాంతంలోకి పారిపోయేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, సైన్యం, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా వారిపై ఎదురుదాడికి దిగారు.
మంగళవారం ఉదయం మొదలైన భీకర ఎన్కౌంటర్ సుమారు 48 గంటల పాటు కొనసాగింది. ఉగ్రవాదులు స్థానిక మసీదుల్లో నక్కి భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. భద్రతా దళాలు మంగళవారమే నలుగురు ముష్కరులను మట్టుబెట్టాయి. ఐదో ఉగ్రవాదిని బుధవారం హతమార్చాయి. ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు భద్రతా సిబ్బంది కూడా మరణించారు. వీరిలో ఇద్దరు పోలీసులు, ముగ్గురు జవాన్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఓ సైనికుడు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..







