నీట మునిగి ఐదేళ్ళ చిన్నారి మృతి
- March 21, 2018మనామా: మూసివేసిన ఓ స్విమ్మింగ్ పూల్ ఐదేళ్ళ చిన్నారిని బలిగొంది. దర్ కులైబ్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన స్నేహితులతో కలిసి రౌండెబౌట్ 22 దగ్గరలో గల హమాద్ టౌన్ స్విమ్మింగ్ పూల్ దగ్గరకి మృతుడితోపాటు ఇంకొందరు చిన్నారులు వెళ్ళారు. రెసిడెంట్స్ చెబుతున్న వివరాల ప్రకారం స్విమ్మింగ్ పూల్లో సగం నీరు మాత్రమే వుంది. ల్యాండ్ లార్డ్కీ రెంటరర్కీ మధ్య లీగల్ డిస్ప్యూట్ కారణంగా ఈ స్విమ్మింగ్ పూల్ సరైన నిర్వహణలో లేదు. స్విమ్మింగ్ పూల్లో మునిగిపోయిన చిన్నారిని గుర్తించి వెంటనే బయటకు తీసి ఆసుపత్రికి తరలించినా, ప్రయోజనం లేకుండా ఓయింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. మృతుడికి దర్ కులైబ్ గ్రేవ్యార్డ్లో అంత్యక్రియలు నిర్వహించారు.
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్