గడువు తీరిన కేక్‌ అమ్మకం: ముగ్గురి అరెస్ట్‌

- March 22, 2018 , by Maagulf
గడువు తీరిన కేక్‌ అమ్మకం: ముగ్గురి అరెస్ట్‌

మస్కట్‌: ఇజ్కి లోని ఓ స్కూల్‌లో విద్యార్థులకు గడువు తీరిన కేక్‌లను విక్రయించినందుకుగాను ముగ్గుర్ని అరెస్ట్‌ చేసినట్లు పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ కన్స్యుమర్‌ ప్రొటెక్షన్‌ వెల్లడించింది. ఇందులో ఇద్దరికి 2,000 ఒమన్‌ రియాల్స్‌ జరీమానా విధించగా, మరో వ్యక్తికి 200 ఒమన్‌ రియాల్స్‌ జరీమానా విధించారు. కన్స్యుమర్‌ ప్రొటెక్షన్‌ చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. విక్రయించిన కేకులపై లేబుల్స్‌ని టాంపరింగ్‌ చేయడం, గడువు తీరిన కేక్‌లను విక్రయించడం ద్వారా నిందితులు చట్టాన్ని ఉల్లంఘించి, నేరానికి పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇజ్కి స్కూల్‌ నుంచి అందిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. క్యాంటీన్‌లో అమ్మకందారులు, 'గడువు' పేర్కొనకపోవడం, కొన్ని కేక్‌లపై స్టిక్కర్స్‌ లేకుండా, 'గడువు' ట్యాంపరింగ్‌ చేయడం వంటి ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు అధికారులకు ఇజ్కి స్కూల్‌ ఫిర్యాదు చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com