టాలీవుడ్ నిర్మాత సంగిశెట్టి దశరథ కన్నుమూత..
- March 22, 2018
సినీ నిర్మాత సంగిశెట్టి దశరథ అనారోగ్యంతో గురువారం ఉదయం హైదరాబాద్లో కన్నుమూశారు. ఆయనకు 65 ఏళ్లు. హైదరాబాద్ లోని బోయిన్పల్లిలో ఆయన నివాసం ఉంటున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన డయాలసిస్ కూడా చేయించుకుంటున్నారు. దాదాపు ముఫై ఏళ్లకు పైగా ఆయన తెలుగు సినీరంగంలో ఉంటూ పలు సినిమాలను స్నేహితులతో కలిసి నిర్మించారు. ఇంద్రధనుస్సు, ఆత్మబంధం, టార్గెట్ వంటి పలు సినిమాలు ఆయన తీసిన వాటిలో ఉన్నాయి. తాజాగా విశ్వప్రసాద్ దర్శకత్వంలో నిర్మించిన భార్య చిత్రం విడుదల కావాల్సివుంది. చిన్న చిత్రాల నిర్మాతలకు ఎదరవుతున్న కష్టనష్టాలపై ఆయన ఎన్నోసార్లు స్పందించారు. సినీరంగంలోని అనేక సమస్యలపై జరిగిన పోరాటాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. చిన్న సినిమాల విడుదలలో నెలకొన్న థియేటర్ల సమస్యపై తెలుగు చలనచిత్ర పరిరక్షణ సమితి తరపున జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో కూడా ఆయన చురుకుగా పాల్గొన్నారు. దశరథ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తంచేస్తూ, వారి కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు.
తాజా వార్తలు
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం







