టాలీవుడ్ నిర్మాత సంగిశెట్టి దశరథ కన్నుమూత..
- March 22, 2018
సినీ నిర్మాత సంగిశెట్టి దశరథ అనారోగ్యంతో గురువారం ఉదయం హైదరాబాద్లో కన్నుమూశారు. ఆయనకు 65 ఏళ్లు. హైదరాబాద్ లోని బోయిన్పల్లిలో ఆయన నివాసం ఉంటున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన డయాలసిస్ కూడా చేయించుకుంటున్నారు. దాదాపు ముఫై ఏళ్లకు పైగా ఆయన తెలుగు సినీరంగంలో ఉంటూ పలు సినిమాలను స్నేహితులతో కలిసి నిర్మించారు. ఇంద్రధనుస్సు, ఆత్మబంధం, టార్గెట్ వంటి పలు సినిమాలు ఆయన తీసిన వాటిలో ఉన్నాయి. తాజాగా విశ్వప్రసాద్ దర్శకత్వంలో నిర్మించిన భార్య చిత్రం విడుదల కావాల్సివుంది. చిన్న చిత్రాల నిర్మాతలకు ఎదరవుతున్న కష్టనష్టాలపై ఆయన ఎన్నోసార్లు స్పందించారు. సినీరంగంలోని అనేక సమస్యలపై జరిగిన పోరాటాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. చిన్న సినిమాల విడుదలలో నెలకొన్న థియేటర్ల సమస్యపై తెలుగు చలనచిత్ర పరిరక్షణ సమితి తరపున జరిగిన ఆందోళన కార్యక్రమాల్లో కూడా ఆయన చురుకుగా పాల్గొన్నారు. దశరథ మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తంచేస్తూ, వారి కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు.
తాజా వార్తలు
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష
- ఈద్ అల్ అధా శుభాకాంక్షలు తెలుపుకున్న యూఏఈ అధ్యక్షుడు, ఒమాన్ సుల్తాన్
- ఈద్ అల్ అధా సందర్భంగా 104 మంది ఖైదీలకు ఫుజైరా రూలర్ క్షమాభిక్ష
- బాలికపై అత్యాచార కేసు ప్రెస్ మీట్లో నవ్విన అధికారులపై సీఎం విజయ్ సస్పెన్షన్ వేటు!
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు
- దేశ ఆర్థిక వ్యవస్థ పై నిరాశావాదుల ప్రచారం నమ్మొద్దు: ఆర్థిక మంత్రి నిర్మలమ్మ!
- తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం...
- బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్రకు పద్మవిభూషణ్









