కేంబ్రిడ్జ్ ఎనలిటికాలో బ్రిటన్ అధికారుల సోదాలు
- March 24, 2018
లండన్: సామాజిక మాధ్యమం ఫేస్బుక్ నుంచి సమాచార చౌర్యానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంబ్రిడ్జ్ ఎనలిటికా కార్యాలయాలలో బ్రిటన్ అధికారులు సోదాలు నిర్వహించారు. శుక్రవారం రాత్రి మొదలైన సోదాలు శనివారం ఉదయం వరకు కొనసాగాయని సమాచార కమిషనర్ కార్యాలయం తెలిపింది. తమకు లభించిన సమాచారాన్ని పరిశీలించిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నది. జడ్జి నుంచి అనుమతి పొందిన తరువాత తమ ఏజెంట్లు 18 మంది స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8 గంటలకు ఎనలిటికా కార్యాలయంలో ప్రవేశించారని, తిరిగి శనివారం తెల్లవారు జామున 3 గంటలకు బయటకు వచ్చారని ఓ ప్రభుత్వ ప్రతినిధి చెప్పారు. భారత ప్రభుత్వం సైతం కేంబ్రిడ్జ్ ఎనలిటికా సంస్థకు నోటీసులు జారీ చేసింది.
తాజా వార్తలు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!









