నీలి రంగు నస్సాక్ వజ్రాన్ని తెప్పించండి: త్రయంబకేశ్వర్ ఆలయ ట్రస్టీ విజ్ఞప్తి

- March 24, 2018 , by Maagulf
నీలి రంగు నస్సాక్ వజ్రాన్ని తెప్పించండి: త్రయంబకేశ్వర్ ఆలయ ట్రస్టీ విజ్ఞప్తి

లెబనాన్‌లోని నీలి రంగు నస్సాక్ వజ్రాన్ని తెప్పించాలని భారత పురావస్తు శాఖకి త్రయంబకేశ్వర్ ఆలయ ట్రస్టీ విజ్ఞప్తి చేశారు. ప్రాచీనకాలంలో పలువురు రాజుల దాడుల సమయంలో దీన్ని ఎత్తుకెళ్లారని, ప్రస్తుతం లెబనాన్‌లోని ఓ ప్రైవేట్ మ్యూజియంలో ఉన్నదన్నారు. దీన్ని భారత్‌కు తిరిగి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌లకు లేఖలు రాశారు. త్రయంబకేశ్వరుడి మూడో కన్నుగా పిలుచుకు నే ఈ వజ్రం 43.38 క్యారట్ల బరువు ఉంటుందన్నారు. గతంలో త్రయంబకేశ్వరుడి కిరీటంలో ఇది ఉండేదన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com