t20 సిరీస్‌ నుంచి నిష్క్రమించిన భారత్

- March 26, 2018 , by Maagulf
t20 సిరీస్‌ నుంచి నిష్క్రమించిన భారత్

వరుస ఓటములతో సిరీస్ నుంచి నిష్క్రమించింది భారత్. మహిళల ముక్కోణపు t20 సిరీస్ లో భాగంగా  ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో భారత్  హ్యాట్రిక్ ఓటమి నమోదుచేసింది. సోమవారం జరిగిన మహిళల మూడో t20 మ్యాచ్ లో భారత్ 36 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత టాస్ గెలిచిన భారత జట్టు ప్రత్యర్థిని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆస్ట్రేలియా జట్టు 186 పరుగులు సాధించింది. అనంతరం 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 150 పరుగులకే అల్ అవుట్ అయింది. ఈ ఓటమితో భారత్ సిరీస్ కోల్పోయింది. అనుజా పాటిల్‌ 38 పరుగులు, పూజా 19 పరుగులు సాధించారు. ఇక వరుసగా మూడు ఓటములతో ఈ ట్రై సిరీస్‌ లో బెర్త్‌కు దూరమైంది భారత్. అయితే ఇంగ్లాండ్‌తో మరో నామమాత్రపు మ్యాచ్‌ను భారత్‌ ఆడనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com