రస్ అల్ ఖైమాలో 25 ఏళ్ళ వ్యక్తి మిస్సింగ్
- March 26, 2018
రస్ అల్ ఖైమా పోలీస్, గల్ఫ్ పౌరుడొకరు 'మిస్సింగ్' అయ్యారనీ, అతని ఆచూకీ తెలపడంలో సహకరించాలని పబ్లిక్కి విజ్ఞప్తి చేశారు. హుమైద్ బిన్ మొహమ్మద్ బిన్ సలెమ్ అల్ మెనబాలీ, గత కొన్ని రోజులుగా కన్పించడంలేదని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మానసికంగా డిస్టర్బ్ అయిన అల్ మెక్బాలి, సోదరి భర్తతో కలిసి నఖీల ప్రాంతంలో గత రెండేళ్ళుగా నివసిస్తున్నారు. అల్ మెక్బాలీ బంధువు అబ్దుల్లా అల్ షెహి మాట్లాడుతూ, ఎప్పుడూ తీవ్ర మనస్తాపంతో బాధపడుతుండేవాడనీ, ఆ సమయాల్లో గ్రాసరీస్ కోసం బయటకు వెల్ళి, రిలాక్స్ అయ్యాక వచ్చేవాడనీ చెప్పారు. గత గురువారం బయటకు వెళ్ళి తిరిగి రాలేదనీ, మొబైల్ ఫోన్, ఐడెంటిటీ డాక్యుమెంట్స్ని కూడా తనతో తీసుకెళ్ళలేదని అల్ సెహి వివరించారు. బంధువులు, స్నేహితుల ఇళ్ళకూ అల మెక్బాలీ వెళ్ళలేదని వారు చెబుతున్నారు. ఎవరైనా అతని ఆచూకీ కనుగొంటే, వెంటనే తమకు సమాచారమివ్వాలని అల్ మెక్బలి బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







