రస్ అల్ ఖైమాలో 25 ఏళ్ళ వ్యక్తి మిస్సింగ్
- March 26, 2018
రస్ అల్ ఖైమా పోలీస్, గల్ఫ్ పౌరుడొకరు 'మిస్సింగ్' అయ్యారనీ, అతని ఆచూకీ తెలపడంలో సహకరించాలని పబ్లిక్కి విజ్ఞప్తి చేశారు. హుమైద్ బిన్ మొహమ్మద్ బిన్ సలెమ్ అల్ మెనబాలీ, గత కొన్ని రోజులుగా కన్పించడంలేదని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మానసికంగా డిస్టర్బ్ అయిన అల్ మెక్బాలి, సోదరి భర్తతో కలిసి నఖీల ప్రాంతంలో గత రెండేళ్ళుగా నివసిస్తున్నారు. అల్ మెక్బాలీ బంధువు అబ్దుల్లా అల్ షెహి మాట్లాడుతూ, ఎప్పుడూ తీవ్ర మనస్తాపంతో బాధపడుతుండేవాడనీ, ఆ సమయాల్లో గ్రాసరీస్ కోసం బయటకు వెల్ళి, రిలాక్స్ అయ్యాక వచ్చేవాడనీ చెప్పారు. గత గురువారం బయటకు వెళ్ళి తిరిగి రాలేదనీ, మొబైల్ ఫోన్, ఐడెంటిటీ డాక్యుమెంట్స్ని కూడా తనతో తీసుకెళ్ళలేదని అల్ సెహి వివరించారు. బంధువులు, స్నేహితుల ఇళ్ళకూ అల మెక్బాలీ వెళ్ళలేదని వారు చెబుతున్నారు. ఎవరైనా అతని ఆచూకీ కనుగొంటే, వెంటనే తమకు సమాచారమివ్వాలని అల్ మెక్బలి బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం









