రస్ అల్ ఖైమాలో 25 ఏళ్ళ వ్యక్తి మిస్సింగ్
- March 26, 2018
రస్ అల్ ఖైమా పోలీస్, గల్ఫ్ పౌరుడొకరు 'మిస్సింగ్' అయ్యారనీ, అతని ఆచూకీ తెలపడంలో సహకరించాలని పబ్లిక్కి విజ్ఞప్తి చేశారు. హుమైద్ బిన్ మొహమ్మద్ బిన్ సలెమ్ అల్ మెనబాలీ, గత కొన్ని రోజులుగా కన్పించడంలేదని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మానసికంగా డిస్టర్బ్ అయిన అల్ మెక్బాలి, సోదరి భర్తతో కలిసి నఖీల ప్రాంతంలో గత రెండేళ్ళుగా నివసిస్తున్నారు. అల్ మెక్బాలీ బంధువు అబ్దుల్లా అల్ షెహి మాట్లాడుతూ, ఎప్పుడూ తీవ్ర మనస్తాపంతో బాధపడుతుండేవాడనీ, ఆ సమయాల్లో గ్రాసరీస్ కోసం బయటకు వెల్ళి, రిలాక్స్ అయ్యాక వచ్చేవాడనీ చెప్పారు. గత గురువారం బయటకు వెళ్ళి తిరిగి రాలేదనీ, మొబైల్ ఫోన్, ఐడెంటిటీ డాక్యుమెంట్స్ని కూడా తనతో తీసుకెళ్ళలేదని అల్ సెహి వివరించారు. బంధువులు, స్నేహితుల ఇళ్ళకూ అల మెక్బాలీ వెళ్ళలేదని వారు చెబుతున్నారు. ఎవరైనా అతని ఆచూకీ కనుగొంటే, వెంటనే తమకు సమాచారమివ్వాలని అల్ మెక్బలి బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









