ఐపిఎల్‌ విజేతకు నగదు పెంపు

- March 27, 2018 , by Maagulf
ఐపిఎల్‌ విజేతకు నగదు పెంపు

ముంబాయి : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌) విజేతకు ఇచ్చే నగదును బీసీసీఐ పెంచింది. గత ఏడాది విజేత జట్టుకు రూ.15 కోట్లు ఇవ్వగా ఈసారి టోర్నీ విజేతగా నిలిచే జట్టుకు ఇచ్చే మొత్తాన్ని 26 కోట్ల రూపాయలకు పెంచింది. ఫైనల్లో ఓడిన (రన్నరప్‌) జట్టుకు గత ఏడాది రూ. 10 కోట్లు ముట్ట జెప్పగా ఆ మొత్తాన్ని ఈసారి రూ.13 కోట్లకు పెంచారు. అంతేగాక ఐపీఎల్‌లో మొత్తం ప్రైజ్‌మనీ ద్వారా ఆటగాళ్లకు రూ.56 కోట్లు దక్కనున్నాయి. ప్రతి మ్యాచ్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌తో పాటు మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌, అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లకు లక్ష రూపాయల చొప్పున బహుమతులు ఇవ్వనున్నారు.అవన్నీ కలుపుకుంటే సుమారు రూ.56 కోట్ల రూపాయల వరకు ఆటగాళ్లకు ప్రైజ్‌మనీ రూపంలో ఇవ్వనున్నారు. ఈ ఏడాది ఈ మెగా ఐపీఎల్‌ టోర్నీ ఏప్రిల్‌ 7న ప్రారంభంకానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com