ఐడియా ఇవ్వు..10 లక్షలు పట్టు: భారతీయ రైల్వే
- March 27, 2018
అవును మీరు విన్నది నిజమే.. ! ఒక్క ఐడియాతో అక్షరాలా రూ.10లక్షలు సంపాదించవచ్చు. కేంద్రమే ఈ ఆఫర్ ను ప్రకటించింది. భారతీయ రైల్వే తన సేవలను మరింతగా మెరుగుపరుచుకునేందుకు ప్రజల నుంచి సలహాలను స్వీకరించే పనిలో పడింది.
ఆదాయాన్ని పెంచుకొనేందుకు ఒక ఐడియా చెప్పండంటూ ఇండియన్ రైల్వేస్ ప్రజలను కోరుతోంది. బెస్ట్ ఐడియా ఇస్తే రూ.10లక్షలు ఇస్తామని, రెండో ఐడియాకు రూ.5లక్షలు, మూడో ఐడియాకు రూ.3లక్షలు, నాలుగో ఐడియాకి రూ.లక్ష వరకూ ఇస్తామని భారతీయ రైల్వే శాఖ వెల్లడించింది. ఆదాయాన్ని మెరుగుపరుచుకొనేందుకు ఈ ఆలోచన చేసినట్లు తెలిపింది. మంచి సలహాలు ఇవ్వాలనుకునువారే https://innovate.mygov.in/jan-bhagidari . అనే వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలు చూడవచ్చు. దీనికి చివరి తేదీగా 2018, మే 19 నిర్ణయించారు.
'మెరుగైన సేవలు ద్వారా అధిక ఆదాయం పొందేందుకు భారతీయ రైల్వేలు ప్రజల నుంచి సలహాలను స్వీకరిస్తోంది. ఇదో మంచి అవకాశం. దీని ద్వారా మిమ్మల్ని మీరు నిరూపించుకున ే అవకాశం ఉంటుందని' జెన్ భగీదరీ వెబ్సైట్ అధికారి తెలిపారు. 'ఐడియా పూర్తి బిజినెస్ ప్లాన్గా ఉండాలి. రైల్వే ఆదాయాన్ని పెంచేందుకు అది ఉపయోగపడాలి' ఆ వెబ్సైట్లో పేర్కొన్నారు.అయితే ఈ పోటీ మొత్తం మూడు దశల్లో ఉంటుంది. మొత్తం 1000పదాలలో మీ ఐడియా ఇస్తే చాలు. మరి ఇంకేందుకు ఆలస్యం.. ఆ ఐడియాయేదో చెప్పేసి రూ.10లక్షలు సంపాదించుకోండి.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







