ఐపిఎల్ విజేతకు నగదు పెంపు
- March 27, 2018
ముంబాయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) విజేతకు ఇచ్చే నగదును బీసీసీఐ పెంచింది. గత ఏడాది విజేత జట్టుకు రూ.15 కోట్లు ఇవ్వగా ఈసారి టోర్నీ విజేతగా నిలిచే జట్టుకు ఇచ్చే మొత్తాన్ని 26 కోట్ల రూపాయలకు పెంచింది. ఫైనల్లో ఓడిన (రన్నరప్) జట్టుకు గత ఏడాది రూ. 10 కోట్లు ముట్ట జెప్పగా ఆ మొత్తాన్ని ఈసారి రూ.13 కోట్లకు పెంచారు. అంతేగాక ఐపీఎల్లో మొత్తం ప్రైజ్మనీ ద్వారా ఆటగాళ్లకు రూ.56 కోట్లు దక్కనున్నాయి. ప్రతి మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్తో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్, అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లకు లక్ష రూపాయల చొప్పున బహుమతులు ఇవ్వనున్నారు.అవన్నీ కలుపుకుంటే సుమారు రూ.56 కోట్ల రూపాయల వరకు ఆటగాళ్లకు ప్రైజ్మనీ రూపంలో ఇవ్వనున్నారు. ఈ ఏడాది ఈ మెగా ఐపీఎల్ టోర్నీ ఏప్రిల్ 7న ప్రారంభంకానుంది.
తాజా వార్తలు
- పౌరులకు, నివాసితులకు సుల్తాన్ ఈద్ అల్ అదా శుభాకాంక్షలు..!!
- యాత్రికులకు రికార్డుస్థాయిలో మషాయిర్ మెట్రో సేవలు..!!
- ఆన్లైన్ బుకింగ్ మోసాలపై కువైట్ హెచ్చరిక..!!
- సీబీఎస్ఈ 12.. రీవాల్యుయేషన్ కు పెరుగుతున్న దరఖాస్తులు..కారణం ఇదేనా?
- ఖలాలీలో హయా బియా వేడుకలకు భారీ స్పందన..!!
- ఇరాన్ ప్రెసిడెంట్ తో చర్చలు జరిపిన అమీర్..!!
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!









