ఐపిఎల్ విజేతకు నగదు పెంపు
- March 27, 2018
ముంబాయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) విజేతకు ఇచ్చే నగదును బీసీసీఐ పెంచింది. గత ఏడాది విజేత జట్టుకు రూ.15 కోట్లు ఇవ్వగా ఈసారి టోర్నీ విజేతగా నిలిచే జట్టుకు ఇచ్చే మొత్తాన్ని 26 కోట్ల రూపాయలకు పెంచింది. ఫైనల్లో ఓడిన (రన్నరప్) జట్టుకు గత ఏడాది రూ. 10 కోట్లు ముట్ట జెప్పగా ఆ మొత్తాన్ని ఈసారి రూ.13 కోట్లకు పెంచారు. అంతేగాక ఐపీఎల్లో మొత్తం ప్రైజ్మనీ ద్వారా ఆటగాళ్లకు రూ.56 కోట్లు దక్కనున్నాయి. ప్రతి మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్తో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్, అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లకు లక్ష రూపాయల చొప్పున బహుమతులు ఇవ్వనున్నారు.అవన్నీ కలుపుకుంటే సుమారు రూ.56 కోట్ల రూపాయల వరకు ఆటగాళ్లకు ప్రైజ్మనీ రూపంలో ఇవ్వనున్నారు. ఈ ఏడాది ఈ మెగా ఐపీఎల్ టోర్నీ ఏప్రిల్ 7న ప్రారంభంకానుంది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









