అమెరికాలో పాకిస్తాన్ ప్రధాని షాహిద్ అబ్బాసీ భద్రతా తనిఖీలు
- March 27, 2018
ఇస్లామాబాద్ : అమెరికా ఎయిర్పోర్ట్లో పాకిస్తాన్ ప్రధాని షాహిద్ అబ్బాసీ భద్రతా తనిఖీలు ఎదుర్కొన్నారనే వార్తలు పాక్, అమెరికా సంబంధాలను మరింత దెబ్బతీసేలా ఉన్నాయి. తమ ప్రధాని పట్ల అమర్యాదకరంగా వ్యవహరించారని అమెరికాపై పాక్ మండిపడుతోంది. పాక్ జాతీయులపై ట్రంప్ యంత్రాంగం చేపట్టిన వీసా బ్యాన్ నియంత్రణలను ఈ సందర్భంగా ఉటంకిస్తున్నారు. అయితే పాకిస్తాన్ ప్రధాని స్వచ్ఛందంగా భద్రతా ప్రమాణాలను అనుసరించారని పాక్కు చెందిన జియో న్యూస్ పేర్కొంది.
అబ్బాసీ అమెరికాలో ప్రైవేట్ పర్యటనలో ఉన్నారని పేర్కొంటూ పాక్ ప్రధాని సెక్యూరిటీ ప్రొటోకాల్ లేకుండా ఎయిర్పోర్ట్లో కనిపిస్తున్న వీడియోను జియో న్యూస్ విడుదల చేసింది. వ్యక్తిగత జీవితంలో అబ్బాసీ ఎంత నిరాడంబరంగా ఉంటారనేందుకు ఇది నిదర్శనమని తెలిపింది. ఇటీవల బ్రిటన్ పర్యటనలోనూ ఆయన రైలులో ఒంటరిగా ప్రయాణించారని గుర్తు చేసింది. పుట్టినరోజు వేడుకల్లోనూ శాలువా ధరించి బర్త్డే కేక్ను కట్చేస్తున్న ఆయన ఫోటోను జియో న్యూస్ ప్రదర్శించింది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!