కాగ్నిజెంట్ టెక్నాలజీకి షాక్ - బ్యాంకు ఖాతాలు సీజ్
- March 27, 2018
ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఆదాయపు పన్నును ఎగవేసిందన్న ఆరోపణలపై ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు ఐటీ శాఖ షాకిచ్చింది. సంస్థకు చెందిన వివిధ బ్యాంకు ఖాతాలను సీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. కాగ్నిజెంట్ నుంచి 2016-17 సంవత్సరానికిగాను రూ. 2500 కోట్లకు పైగా టాక్స్ రావాల్సి వుందని ఆదాయ పన్ను శాఖ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ టాక్స్ (డిటిటి)ను సంస్థ ఇప్పటి వరకూ చెల్లించ లేదని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ విషయంలో సంస్థకు నోటీసులు పంపినా స్పందించలేదని, దీంతో చెన్నై, ముంబైలోని కాగ్నిజెంట్ బ్యాంకు ఖాతాలను సస్పెండ్ చేసి స్వాధీనం చేసుకున్నామని అన్నారు. కాగా, తమ ఖాతాలను స్తంభింపజేయడంపై కాగ్నిజెంట్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. తాము అన్నిబకాయిలను చెల్లించామని సంస్థ ప్రతినిధి ఒకరు వివరణ ఇచ్చారు. మరిన్ని వివరాలను అందించడానికి మాత్రం ఆయన నిరాకరించడం గమనార్హం.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









