కాగ్నిజెంట్ టెక్నాలజీకి షాక్ - బ్యాంకు ఖాతాలు సీజ్
- March 27, 2018
ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఆదాయపు పన్నును ఎగవేసిందన్న ఆరోపణలపై ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు ఐటీ శాఖ షాకిచ్చింది. సంస్థకు చెందిన వివిధ బ్యాంకు ఖాతాలను సీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. కాగ్నిజెంట్ నుంచి 2016-17 సంవత్సరానికిగాను రూ. 2500 కోట్లకు పైగా టాక్స్ రావాల్సి వుందని ఆదాయ పన్ను శాఖ అధికారులు వెల్లడించారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ టాక్స్ (డిటిటి)ను సంస్థ ఇప్పటి వరకూ చెల్లించ లేదని సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఈ విషయంలో సంస్థకు నోటీసులు పంపినా స్పందించలేదని, దీంతో చెన్నై, ముంబైలోని కాగ్నిజెంట్ బ్యాంకు ఖాతాలను సస్పెండ్ చేసి స్వాధీనం చేసుకున్నామని అన్నారు. కాగా, తమ ఖాతాలను స్తంభింపజేయడంపై కాగ్నిజెంట్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. తాము అన్నిబకాయిలను చెల్లించామని సంస్థ ప్రతినిధి ఒకరు వివరణ ఇచ్చారు. మరిన్ని వివరాలను అందించడానికి మాత్రం ఆయన నిరాకరించడం గమనార్హం.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







