మనామా:టెర్రర్ సెల్ కేసు ఏప్రిల్ 11కి వాయిదా
- March 28, 2018
మనామా: మిలిటరీ కోర్ట్ కాస్సేషన్, టెర్రర్ సెల్ కేస్ 1/2017 విచారణను ఏప్రిల్ 11కి వాయిదా వేసింది. హై మిలియటరీ అపీల్స్ కోర్ట్ రూలింగ్కి వ్యతిరేకంగా డిఫెన్స్ అటార్నీలు తమ వాదనల్ని విన్పించేందుకు న్యాయస్థానం అవకాశం కల్పించింది. ఏడుగురు నిందితులు టీవ్రవాద సంస్థను ఏర్పాటు చేసి, పలు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ నిర్వహించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిందితుల్లో ముబారక్ అదెల్ ముబారక్ మహన్నా (సోల్జర్), ఫాదిల్ అల్సాయెద్ అబ్బాస్ హసన్ రాధి, అల్సాయెద్ అలావి హుస్సేన్ అలావి హుస్సేన్, మొహమ్మద్ అబ్దుల్హసన్ అహ్మద్ అల్మిత్గావవి, మొహమ్మద్ అబ్దుల్హుస్సేన్ సలెహ్ అల్ షెహాబి, మొహమ్మద్ అబ్దుల్ వాహిద్ మొహమ్మద్ అల్నాజ్జర్, హుస్సేన్ మొహమ్మద్ అహ్మద్ సాయెబ్ ఉన్నారు. నిందితులు మిలిటరీ కాస్సేషన్ కోర్ట్ - మిలిటరీ జ్యుడీషియరీ చట్టం 2002 ప్రకారం అన్ని లీగల్ షూరిటీలనుపొందలిగారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









