కరాకస్:జైలులో అగ్నిప్రమాదం.. 68 మంది మృతి
- March 28, 2018
కరాకస్: వెనిజులాలో దారుణం జరిగింది. వలెన్షియా సిటీలోని పోలీస్ స్టేషన్లో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 68 మంది మృతిచెందారు. జైలు వద్ద అల్లర్లు జరగడంతో పోలీసులు ఫైరింగ్కు దిగారు. అదే సమయంలో అక్కడ భారీ అగ్ని ప్రమాదం జరిగంది. కారాబోబో రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. ఈ విషాద ఘటన పట్ల విచారణ నిర్వహించనున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి తెలిపారు. జైలు నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో ఖైదీలు అక్కడున్న మంచాలకు నిప్పుపెట్టారు. దీంతో అక్కడ భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. అదే సమయంలో పోలీస్ స్టేషన్ ముందున్న వారిని తరిమేందుకు పోలీసులు టియర్ గ్యాస్ను ప్రయోగించారు. ఓ పోలీస్ను అల్లరి మూకలు కాల్చి చంపినట్లు సమాచారం.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









