కరాకస్:జైలులో అగ్నిప్రమాదం.. 68 మంది మృతి
- March 28, 2018కరాకస్: వెనిజులాలో దారుణం జరిగింది. వలెన్షియా సిటీలోని పోలీస్ స్టేషన్లో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 68 మంది మృతిచెందారు. జైలు వద్ద అల్లర్లు జరగడంతో పోలీసులు ఫైరింగ్కు దిగారు. అదే సమయంలో అక్కడ భారీ అగ్ని ప్రమాదం జరిగంది. కారాబోబో రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. ఈ విషాద ఘటన పట్ల విచారణ నిర్వహించనున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి తెలిపారు. జైలు నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో ఖైదీలు అక్కడున్న మంచాలకు నిప్పుపెట్టారు. దీంతో అక్కడ భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. అదే సమయంలో పోలీస్ స్టేషన్ ముందున్న వారిని తరిమేందుకు పోలీసులు టియర్ గ్యాస్ను ప్రయోగించారు. ఓ పోలీస్ను అల్లరి మూకలు కాల్చి చంపినట్లు సమాచారం.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..