కరాకస్:జైలులో అగ్నిప్రమాదం.. 68 మంది మృతి
- March 28, 2018
కరాకస్: వెనిజులాలో దారుణం జరిగింది. వలెన్షియా సిటీలోని పోలీస్ స్టేషన్లో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 68 మంది మృతిచెందారు. జైలు వద్ద అల్లర్లు జరగడంతో పోలీసులు ఫైరింగ్కు దిగారు. అదే సమయంలో అక్కడ భారీ అగ్ని ప్రమాదం జరిగంది. కారాబోబో రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. ఈ విషాద ఘటన పట్ల విచారణ నిర్వహించనున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి తెలిపారు. జైలు నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో ఖైదీలు అక్కడున్న మంచాలకు నిప్పుపెట్టారు. దీంతో అక్కడ భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. అదే సమయంలో పోలీస్ స్టేషన్ ముందున్న వారిని తరిమేందుకు పోలీసులు టియర్ గ్యాస్ను ప్రయోగించారు. ఓ పోలీస్ను అల్లరి మూకలు కాల్చి చంపినట్లు సమాచారం.
తాజా వార్తలు
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!
- జెడ్డాలో 1,480 మంది పౌరులకు భూమి పత్రాలు అందజేత..!!
- ఖతార్ సైంటిఫిక్ క్లబ్ ‘యంగ్ ఇన్వెంటర్స్’ ప్రారంభం..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు పసికందులు సజీవ దహనం
- ఫస్ట్, బిజినెస్ క్లాస్ టికెట్లపై రూమర్స్.. ఖండించిన కువైట్ ఎయిర్వేస్..!!







