'ఆర్కే మీడియా - ఇండియన్ ఫుడ్ ట్రక్ ఫెస్టివల్'
- March 29, 2018
హైదరాబాద్:ఆర్కే మీడియా, 'ది ఇండియన్ ఫుడ్ ట్రక్ ఫెస్టివల్ 2018'ని హైద్రాబాద్లో నిర్వహిస్తోంది. హైద్రాబాద్లోని పీపుల్స్ ప్లాజా ప్రాంతంలో ఈ ఎగ్జిబిషన్ ఏప్రిల్ 21, 22 తేదీల్లో జరుగుతుంది. 29 ఫుడ్ ట్రక్స్ ఈ ఫెస్టివల్లో పాల్గొంటున్నాయి. 200కి పైగా ఇండియన్ కజిన్స్, భోజన ప్రియుల చవులూరించనున్నాయి. 58 మందికి పైగా ప్రముఖ ఛెఫ్లు, తమ పాక శాస్త్ర ప్రావీణ్యాన్ని ఇక్కడ ప్రదర్శించబోతున్నారు. లైవ్ మ్యూజిక్, కిడ్స్ జోన్, ఎంటర్టైన్మెంట్, సెలబ్రిటీ గెస్ట్స్ ఇక్కడ ఇతర ప్రధాన ఆకర్షణలు. ఆర్కే మీడియా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ఈ ఫుడ్ ఫెస్టివల్లో దేశంలోని 29 రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక వంటకాలు కొలువు దీరనున్నాయి. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకం అనదగ్గ స్థాయిలో ఈ ఫుడ్ ఫెస్టివల్ని నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రత్యేక వంటకాలకు ప్రాచుర్యం కల్పించడం, అలాగే హాస్పిటాలిటీ రంగానికి సంబంధించి ప్రమోషనల్ ఈవెంట్గా దీన్ని మలచడం వంటివి ఈ ఈవెంట్ లక్ష్యాలని నిర్వహకులు తెలిపారు. భోజన ప్రియులే కాక, దేశంలోని వివిధ సంస్కృతీ సంప్రదాయాల పట్ల ఆసక్తి వున్నవారూ ఈ ఈవెంట్లో పాల్గొని, ప్రత్యేకమైన వంటకాల రుచుల్ని తెలుసుకోవాల్సిందిగా నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష









