యూఏఈలో ఎటిసలాట్ సేవల్లో అవాంతరాలు
- March 29, 2018
యూఏఈ:యూఏఈ టెలికామ్ సంస్థ ఎటిసలాట్, మొబైల్ నెట్వర్క్ని అప్గ్రేడ్ చేస్తున్న దరిమిలా, మూడు నెలలపాటు అవాంతరాలు తలెత్తవచ్చునని పేర్కొంది. వినియోగదారులకు ముందస్తుగా క్షమాపణ చెబుతున్నామనీ ఎటిసలాట్ సంస్థ వివరించింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐజీ డాటా వంటి విభాగాల్లో అప్గ్రెడేషన్ వర్క్ జరుగుతోందని తెలిపింది ఎటిసలాట్. మొబైల్ డేటాలో సరికొత్త అనుభూతిని వినియోగదారులకు కల్పించేందుకు అప్గ్రెడేషన్ జరుగుతోందనీ, ఈ నేపథ్యంలో వినియోగదారులకు సమస్యలు తాత్కాలికంగా తలెత్తే అవకాశం వుందనీ, వీలైనంతవరకు సమస్యలు తగ్గించేలా చూస్తామని ఎటిసలాట్ వెల్లడించింది. సిస్టమ్ అప్గ్రెడేషన్ సమయంలో అవాంతరాలతో సేవలు కొనసాగుతాయని, సేవలు నిలిచిపోయే ప్రసక్తే లేదని సంస్థ స్పస్టం చేసింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







