మళ్ళీ వస్తానని అనుకోలేదు : మలాలా

- March 29, 2018 , by Maagulf
మళ్ళీ వస్తానని అనుకోలేదు : మలాలా

ఇస్లామాబాద్ : నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ కళ్ళ నుంచి గురువారం ఆనంద బాష్పాలు జలజలా స్రవించాయి. ఆమె అనూహ్యంగా తన స్వదేశానికి వచ్చి ప్రధానమంత్రి షాహిద్ కకన్ అబ్బాసీని కలిశారు. అనంతరం ఆమె అమితానందంతో మీడియాతో మాట్లాడారు. తాను మళ్ళీ తన దేశానికి వస్తానని అనుకోలేదని చెమర్చిన కళ్ళు తుడుచుకుంటూ చెప్పారు. తాను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. పాకిస్థాన్ సైన్యానికి, రాజకీయ నేతలకు, పాకిస్థానీలందరికీ ధన్యవాదాలు చెప్తున్నానని తెలిపారు. ఐదేళ్ళ నుంచి తాను స్వదేశానికి తిరిగి రావడంపై ఆలోచిస్తున్నట్లు చెప్పారు.

బాలల విద్య కోసం తప్పనిసరిగా పెట్టుబడులు పెట్టాలని తెలిపారు. పాకిస్థాన్‌లో బాలికా విద్య కోసం మలాలా ఫండ్ 6 మిలియన్ల అమెరికన్ డాలర్లను పెట్టుబడి పెట్టిందన్నారు. రాబోయే తరాలే పాకిస్థాన్ భవిష్యత్తు అని చెప్పారు.

ఆరేళ్ళపాటు లండన్‌లో నివసించిన మలాలా తిరిగి తన స్వదేశానికి బుధవారం అర్ధరాత్రి పాకిస్థాన్ వచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com