అబ్బో! ఆ రైలు లగ్జరీ చూసారా!
- March 29, 2018
ప్యాంగ్యాంగ్, ఉత్తరకొరియా : ఉత్తరకొరియా నియంతలకు అత్యంత ప్రీతిపాత్రమైన రవాణా సాధనం ‘రహస్య రైలు’ లోపలి ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. విమాన భయం ఉన్న కిమ్ జాంగ్ ఉన్ తండ్రి కిమ్ జాంగ్ ఇల్ ఈ రైలును ప్రత్యేకంగా తయారు చేయించుకున్నారు. అంతేకాకుండా ఈ రైలులో పలు ప్రపంచదేశాలకు ఆయన ప్రయాణించారు కూడా.
దాదాపు 90 పెట్టెలు ఉండే ఈ రైలులో దేశాధ్యక్షుడు ప్రయాణిస్తున్న సమయంలో భద్రత రీత్యా ముందొక రైలు, వెనుక మరో రైలు కాపలా ఉంటాయి. బుల్లెట్ ప్రూఫ్ రైలు కావడంతో ఒక్కో పెట్టె భారీగా బరువు ఉంటుంది. దీంతో ఈ రైలు ప్రయాణించే వేగం అత్యధికంగా గంటకు 60 కిలోమీటర్లు మాత్రమే. లగ్జరీ సీటింగ్తో పాటు ప్రపంచదేశాలకు చెందిన వైన్, ఆహార పదార్థాలు ఎల్లప్పుడూ ఈ రైలులో సిద్ధంగా ఉంటాయి.
ఇప్పటివరకూ ఉత్తరకొరియాలోని పలు ప్రదేశాలకు ప్రయాణించడానికి మాత్రమే రైలును ఉపయోగించిన కిమ్.. తొలిసారిగా చైనా ట్రిప్కు ఈ రైలును వాడారు. ఈ సందర్భంగా చైనా అధికారులతో చర్చలు జరిపేందుకు జర్నలిస్టులను రైలులోకి అనుమతించారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









