అబ్బో! ఆ రైలు లగ్జరీ చూసారా!
- March 29, 2018
ప్యాంగ్యాంగ్, ఉత్తరకొరియా : ఉత్తరకొరియా నియంతలకు అత్యంత ప్రీతిపాత్రమైన రవాణా సాధనం ‘రహస్య రైలు’ లోపలి ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. విమాన భయం ఉన్న కిమ్ జాంగ్ ఉన్ తండ్రి కిమ్ జాంగ్ ఇల్ ఈ రైలును ప్రత్యేకంగా తయారు చేయించుకున్నారు. అంతేకాకుండా ఈ రైలులో పలు ప్రపంచదేశాలకు ఆయన ప్రయాణించారు కూడా.
దాదాపు 90 పెట్టెలు ఉండే ఈ రైలులో దేశాధ్యక్షుడు ప్రయాణిస్తున్న సమయంలో భద్రత రీత్యా ముందొక రైలు, వెనుక మరో రైలు కాపలా ఉంటాయి. బుల్లెట్ ప్రూఫ్ రైలు కావడంతో ఒక్కో పెట్టె భారీగా బరువు ఉంటుంది. దీంతో ఈ రైలు ప్రయాణించే వేగం అత్యధికంగా గంటకు 60 కిలోమీటర్లు మాత్రమే. లగ్జరీ సీటింగ్తో పాటు ప్రపంచదేశాలకు చెందిన వైన్, ఆహార పదార్థాలు ఎల్లప్పుడూ ఈ రైలులో సిద్ధంగా ఉంటాయి.
ఇప్పటివరకూ ఉత్తరకొరియాలోని పలు ప్రదేశాలకు ప్రయాణించడానికి మాత్రమే రైలును ఉపయోగించిన కిమ్.. తొలిసారిగా చైనా ట్రిప్కు ఈ రైలును వాడారు. ఈ సందర్భంగా చైనా అధికారులతో చర్చలు జరిపేందుకు జర్నలిస్టులను రైలులోకి అనుమతించారు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







