మిషన్ భగీరథ గ్రిడ్‌ను ప్రారంభించిన కేటీఆర్

- March 30, 2018 , by Maagulf
మిషన్ భగీరథ గ్రిడ్‌ను ప్రారంభించిన కేటీఆర్

వనపర్తి: తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన వనపర్తిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆర్టీసీ డిపో నుంచి పాత బస్టాండ్ వరకు రోడ్డు సుందరీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 22వ వార్డులో పార్కు నిర్మాణం కోసం కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అంతకుముందు.. వనపర్తి సెగ్మెంట్‌లో రూ. 345 కోట్లతో జిల్లాలోని కనాయిపల్లిలో నిర్మించిన మిషన్ భగీరథ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మిషన్ భగీరథ గ్రిడ్‌తో గ్రామాన్ని అనుసంధానం చేసే పనులను ఆయన ప్రారంభించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com