మిషన్ భగీరథ గ్రిడ్ను ప్రారంభించిన కేటీఆర్
- March 30, 2018
వనపర్తి: తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన వనపర్తిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆర్టీసీ డిపో నుంచి పాత బస్టాండ్ వరకు రోడ్డు సుందరీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 22వ వార్డులో పార్కు నిర్మాణం కోసం కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అంతకుముందు.. వనపర్తి సెగ్మెంట్లో రూ. 345 కోట్లతో జిల్లాలోని కనాయిపల్లిలో నిర్మించిన మిషన్ భగీరథ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మిషన్ భగీరథ గ్రిడ్తో గ్రామాన్ని అనుసంధానం చేసే పనులను ఆయన ప్రారంభించారు.
తాజా వార్తలు
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్









