జగన్‌కు శాసనసభ అంటే గౌరవం లేదు : మంత్రి కొల్లు రవీంద్ర

- March 30, 2018 , by Maagulf
జగన్‌కు శాసనసభ అంటే గౌరవం లేదు : మంత్రి కొల్లు రవీంద్ర

విజయవాడ : వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి శాసనసభ అంటే గౌరవం లేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ. వైసీపీని శాశ్వతంగా అసెంబ్లీకి రాకుండా చేయడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. ప్రజలు సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యేలను గెలిపిస్తే వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా ఉండడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించమంటే వాళ్ల సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలో నాటకాలాడుతున్నారన్నారు. ప్రజలు రాబోయే ఎన్నికల్లో వైసీపీకి గట్టిగా బుద్ది చెబుతారన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com