అసభ్యంగా తనిఖీ చేస్తున్నారు:స్పైస్జెట్ ఎయిర్హోస్టెస్ల ఆందోళన
- March 31, 2018
చెన్నై:స్పైస్జెట్కు చెందిన భద్రతాధికారులు ఎయిర్హోస్టెస్లను అసభ్యంగా తనిఖీ చేయడంతో వారు శనివారం ఉదయం ఆందోళనలు చేపట్టారు. గత కొన్ని రోజులుగా విమానం డీబోర్డింగ్ అయ్యాక తమ వస్తువులను, తమను అధికారులు తనిఖీ చేస్తున్నారని, అదే కాకుండా తమ బ్యాగుల్లో ఉన్న శానిటరీ ప్యాడ్స్ను తొలగించాలని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆహారపదార్థాలు, ఇతర వస్తువులను ప్రయాణీకులకు ఇవ్వడానికి వారి నుండి డబ్బు వసూలు చేస్తున్నారనే ఆరోపణపై డీబోర్డింగ్ అయ్యాక వాష్రూమ్కు వెళ్ళకూడదని షరతు కూడా విధించారు. 'తమను గత మూడు రోజులుగా ఘోరంగా తనిఖీ చేస్తున్నారు. మహిళా సిబ్బంది అయినప్పటికీ అసభ్యంగా తాకుతున్నారు. తన కొలిగ్ను శానిటరీ ప్యాడ్ను తొలగించాలని ఆదేశించారు' అని ఓ ఎయిర్హోస్టెస్ తెలిపారు. అయితే... ఈ విషయాన్ని ఎయిర్లైన్స్ సంస్థ ఖండించింది. ఏ ప్రయాణీకుడికైనా, భారత్లోని ఏ విమానాశ్రయానికి వెళ్లినా, భద్రతా తనిఖీలు ఉంటాయని పేర్కొంది.
తాజా వార్తలు
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం







