జింకని వేటాడిన కేసులో నిందితులకి జైలు
- March 31, 2018మస్కట్: పీనల్ అపీల్ కోర్ట్, అరేబియన్ డీర్ని వేటాడిన కేసులో నిందితులుకి జైలు శిక్ష విధించింది. విలాయత్ ఆఫ్ అమెరాత్లోని అల్ సరీన్ నేచుర్ రిజర్వ్లో జింకను వేటాడినట్లు నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. నిందితులకు ఆరు నెలల జైలు శిక్షను న్యాయస్థానం ఖరారు చేసింది. ఈ కేసులో తొలి నిందితుడికి అదనంగా మరో నెల రోజుల జైలు శిక్షను న్యాయస్థానం విధించింది. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం, అలాగే లైసెన్స్ లేకుండా గన్ కలిగి వుండడం అనే అభియోగాలు ఈయనపై మోపబడ్డాయి. నేచురల్ లైఫ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ పెట్రోల్స్, అల్ సరీన్ నేచుర్ రిజర్వ్లో అరేబియన్ డీర్ని వేటాడినట్లు గుర్తించాయి. వెంటనే రాయల్ ఒమన్ పోలీస్కి సమాచారం అందించగా, నిందితుల్ని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కత్తినీ, గన్నీ, ఓ బ్యాగ్నీ స్వాధీనం చేసుకన్నారు పోలీసులు.
తాజా వార్తలు
- తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
- లోక్సభ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: డీజీపీ రవిగుప్తా
- అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు, ఫీజు, ప్రక్రియ
- దుబాయ్లో పెట్టుబడి ద్వారా ఉద్యోగి గోల్డెన్ వీసాకు మారవచ్చా?
- బహ్రెయిన్ చేరుకున్న అరబ్ లీగ్ చీఫ్
- మోసపూరిత ప్రకటనల పై సౌదీ హెచ్చరిక
- కువైట్ అమీర్ కు వ్యతిరేకంగా పోస్టులు..పలువురికి నోటీసులు
- 250 మంది ప్రవాసులకు ఒమానీ పౌరసత్వం
- భారత దేశ వ్యాప్తంగా నాల్గో విడత పోలింగ్కు సర్వంసిద్ధం..
- పోలింగ్కు పటిష్ట బందోబస్తు: సీపీ తరుణ్ జోషి