శ్రీదేవికి భారతరత్న ఇవ్వాలన్న శారద

- April 01, 2018 , by Maagulf
శ్రీదేవికి భారతరత్న ఇవ్వాలన్న శారద

చెన్నై : ఇటీవలే మృతి చెందిన అందాల తార శ్రీదేవికి భారత రత్న ఇవ్వాలని సీనియర్ నటి శారద కోరారు. చెన్నైలోని ఆంధ్రా క్లబ్ లో శ్రీదేవి సంతాప సభ జరిగింది. ఈ సభలో పాల్గొన్న శారద...శ్రీదేవితో తనకున్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తన నటనతో శ్రీదేవి గుర్తింపు తెచ్చుకున్నారని, శ్రీదేవికి భారతరత్న వచ్చేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయి నివాళి అర్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com