జమ్మూ కాశ్మీర్ లో 8 మంది ఉగ్రవాదుల హతం.!

- April 01, 2018 , by Maagulf
జమ్మూ కాశ్మీర్ లో 8 మంది ఉగ్రవాదుల హతం.!

వరుసగా జరిగిన ఎన్ కౌంటర్లలో ఎనిమిది మంది ఉగ్రవాదులు హతం కాగా ఇద్దరు భారత జవాన్లకు గాయాలయ్యాయి. వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. షోపియాన్ జిల్లాలో సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న భారత బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీనితో భారత సైన్యం ధీటుగా స్పందించింది. ఎదురు కాల్పులు జరపడంతో ఏడుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. అనంతనాగ్ జిల్లాలోని ఓ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఆయా ఘటనా ప్రదేశాల నుండి పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రీ, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే షోపియాన్ లోని కచ్ దూర్ లో స్థానికులను బందీలుగా చేసుకుని ఉగ్రవాదులు నక్కినట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com