కొనసాగుతున్న భారత్ బంద్ !
- April 01, 2018ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీం తన ఆదేశాలను వెనక్కు తీసుకోవాలంటూ దళిత సంఘాలు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో బీహార్, పంజాబ్, యూపీ, ఒడిషాలో ఉదయం నుంచే ఆందోళనలు మొదలయ్యాయి. గుంపులుగా రోడ్లపైకి వచ్చిన దళిత సంఘాలు బలవంతంగా షాపులు మూయించారు.
పంజాబ్లో లుథియానా, జిర్కాపూర్ ఇంకా చాలా ప్రాంతాల్లో రోడ్లు నిర్మానుష్యం అయ్యాయి. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా భారీగా బలగాలను మోహరించారు. రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులు సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలకు దిగారు.
పాట్నాలో జన అధికార్ పార్టీ నేత పప్పూయాదవ్ దళిత సంఘాలకు మద్దతు ప్రకటించారు. తన కార్యకర్తలతో సహా రోడ్డుపైకి వచ్చి భారీ ర్యాలీ చేశారు. దళిత సంఘాలతో కలిసి రాస్తారోకో, రైల్ రోకో చేశారు. భారత్ బంద్ కారణంగా చాలా ప్రాంతాల్లో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక