సమయం పడుతుంది అంటున్న ఫేస్ బుక్ అధినేత

- April 03, 2018 , by Maagulf
సమయం పడుతుంది అంటున్న ఫేస్ బుక్ అధినేత

ఫేస్ బుక్ లో సమస్యలను సరిచేయడానికి కొన్నేళ్లు పడుతుందని ఆ సంస్థ చీఫ్ మార్క్ జకెర్ బర్గ్ అన్నారు. ఫేస్ బుక్ లో లక్షలాది మంది యూజర్ల సమాచారాన్ని కేంబ్రిడ్జ్ అనలైటికా అనే కంపెనీ చోరీ చేయడం, దీనిపై అన్ని వర్గాల నుంచి ఫేస్ బుక్ తీవ్ర విమర్శలు ఎదుర్కోవడం తెలిసిందే. ఇందుకు ఆ సంస్థ క్షమాపణలు కూడా చెప్పింది. పలు కోర్టుల్లో వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో వోక్స్ అనే మీడియా సంస్థతో జుకెర్ బర్గ్ మాట్లాడారు. ''ఈ లోపాలను సవరించగలం. కానీ కొన్నేళ్ల సమయం పడుతుంది. ఈ సమస్యలను మూడు లేదా ఆరు నెలల్లోపే సరిచేయాలని నేను కోరుకుంటున్నాను. కానీ, వాస్తవం ఏమిటంటే ఇంతకంటే ఎక్కువ సమయమే పడుతుంది'' అని జుకెర్ బర్గ్ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com