ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు
- April 03, 2018
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజుకే పగ్గాలు అప్పగిస్తున్నారు. రెండుమూడురోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన రాబోతోంది. కొద్ది రోజులుగా అధ్యక్ష పదవిపై కసరత్తు చేస్తున్న అధిష్టానం.. చివరికి దీనిపై నిర్ణయం తీసుకుంది. మొదట్నుంచి రేసులో మాజీ మంత్రి మాణిక్యాలరావు పేరే వినిపించినా ఆయన ఆ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధంగా లేకపోవడంతో సోముకు లైన్ క్లియరయ్యింది. ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు రంగంలోకి దిగిన రాంమాధవ్.. సామాజిక సమీకరణాల్ని లెక్కలేకి తీసుకుని ఈసారి కాపు సామాజిక వర్గానికి చెందిన నేతకు పార్టీ పగ్గాలు అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చారు. పార్టీలో ముఖ్యనేతలు అందరితోనూ ఈ విషయంపై ఇప్పటికే అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. అధిష్టానం చివరికి వీర్రాజు పేరే ఫైనల్ చేసింది.
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్డి స్మార్ట్ సిటీ ఇండెక్స్లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









