ఫేక్ బాంబ్: నిందితుడికి మూడేళ్ళ జైలు
- April 03, 2018
ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయాలన్న ఉద్దేశ్యంతో ఫేక్ బాంబ్ని తయారుచేసి, దాన్ని ఓ పబ్లిక్ ప్లేస్లో పెట్టినందుకుగాను నిందితుడికి మూడేళ్ళ జైలు శిక్షను విధించింది ఫోర్త్ హై క్రిమినల్ కోర్ట్. 2015లో ఈ ఘటన జరిగింది. నల్లటి బ్యాగ్లో, ఓ ప్లాస్టిక్ కంటెయినర్ని వుంచి, దాన్ని బాంబులా తీర్చిదిద్ది, అదనంగా ఎలక్ట్రానిక్ వైర్లు తగిలించి తుబ్లిలోని ఓ బ్యాకరీలో డిసెంబర్ 5, 2015న నిందితుడు ఆ బ్యాగ్ని వుంచాడు. దాన్ని బాంబుగా భావించి ప్రజలు ఆందోళన చెందారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ బ్యాగ్ని తమతో తీసుకెళ్ళి, పరీక్షలు నిర్వహించి అది ఫేక్ అని తేల్చారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. నిందితుడికి 18 ఏళ్ళ వయసు కావడంతో, కేవలం మూడేళ్ళ శిక్షతో సరిపెడ్తున్నట్లు న్యాయమూర్తులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







