ఫేక్ బాంబ్: నిందితుడికి మూడేళ్ళ జైలు
- April 03, 2018
ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయాలన్న ఉద్దేశ్యంతో ఫేక్ బాంబ్ని తయారుచేసి, దాన్ని ఓ పబ్లిక్ ప్లేస్లో పెట్టినందుకుగాను నిందితుడికి మూడేళ్ళ జైలు శిక్షను విధించింది ఫోర్త్ హై క్రిమినల్ కోర్ట్. 2015లో ఈ ఘటన జరిగింది. నల్లటి బ్యాగ్లో, ఓ ప్లాస్టిక్ కంటెయినర్ని వుంచి, దాన్ని బాంబులా తీర్చిదిద్ది, అదనంగా ఎలక్ట్రానిక్ వైర్లు తగిలించి తుబ్లిలోని ఓ బ్యాకరీలో డిసెంబర్ 5, 2015న నిందితుడు ఆ బ్యాగ్ని వుంచాడు. దాన్ని బాంబుగా భావించి ప్రజలు ఆందోళన చెందారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ బ్యాగ్ని తమతో తీసుకెళ్ళి, పరీక్షలు నిర్వహించి అది ఫేక్ అని తేల్చారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. నిందితుడికి 18 ఏళ్ళ వయసు కావడంతో, కేవలం మూడేళ్ళ శిక్షతో సరిపెడ్తున్నట్లు న్యాయమూర్తులు వెల్లడించారు.
తాజా వార్తలు
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్









