వరల్డ్ ఆటిజం డే: వెలిగిపోయిన దుబాయ్ ఫ్రేమ్
- April 03, 2018
వరల్డ్ ఆటిజం డే సందర్భంగా దుబాయ్ ఫ్రేమ్ వెలుగులతో నిండిపోయింది. సన్సెట్ నుంచి సన్ రైజ్ వరకు బ్లూ కలర్ లైట్లతో దుబాయ్ ఫ్రేమ్ని అందంగా అలంకరించారు. ఆటిజం అనే వ్యాధి పట్ల అవగాహన పెంచేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి యేడాదీ ఏప్రిల్ 2వ తేదీన వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డేగా నిర్వహిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్మెంట్కి చెందిన ఆటిజం సెంటర్ నుంచి పలువురు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దుబాయ్ ఫ్రేమ్ సిబ్బందికీ, అలాగే ఇక్కడికి వచ్చిన సందర్శకులకీ బ్యాడ్జీలను వారు అందించారు. 'లైట్ అప్ బ్లూ' పేరుతో జరిగిన ఈ క్యాంపెయిన్లో 18,600 భవనాలు, 142 దేశాల్లో పాలుపంచుకున్నాయి. అమెరికాకి చెందిన అడ్వొకసీ ఆర్గనైజేషన్ 'ఆటిజం స్పీక్స్' పేరుతో ఈ కార్యక్రమం చేపట్టింది.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







