వరల్డ్ ఆటిజం డే: వెలిగిపోయిన దుబాయ్ ఫ్రేమ్
- April 03, 2018
వరల్డ్ ఆటిజం డే సందర్భంగా దుబాయ్ ఫ్రేమ్ వెలుగులతో నిండిపోయింది. సన్సెట్ నుంచి సన్ రైజ్ వరకు బ్లూ కలర్ లైట్లతో దుబాయ్ ఫ్రేమ్ని అందంగా అలంకరించారు. ఆటిజం అనే వ్యాధి పట్ల అవగాహన పెంచేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి యేడాదీ ఏప్రిల్ 2వ తేదీన వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డేగా నిర్వహిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్మెంట్కి చెందిన ఆటిజం సెంటర్ నుంచి పలువురు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దుబాయ్ ఫ్రేమ్ సిబ్బందికీ, అలాగే ఇక్కడికి వచ్చిన సందర్శకులకీ బ్యాడ్జీలను వారు అందించారు. 'లైట్ అప్ బ్లూ' పేరుతో జరిగిన ఈ క్యాంపెయిన్లో 18,600 భవనాలు, 142 దేశాల్లో పాలుపంచుకున్నాయి. అమెరికాకి చెందిన అడ్వొకసీ ఆర్గనైజేషన్ 'ఆటిజం స్పీక్స్' పేరుతో ఈ కార్యక్రమం చేపట్టింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







