ఒకరి ప్రాణాన్ని బలిగొన్న చీమ
- April 04, 2018
సౌదీ అరేబియా: చీమకుట్టి మహిళ చనిపోయిన ఘటన సౌదీ అరేబియాలో చోటుచేసుకుంది. విషపూరితమైన చీమ కుట్టడం వల్ల సౌదీ అరేబియాలో ఓ మహిళ మృతి చెందింది. నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. ప్రాణాలు కోల్పోయింది మన దేశంలోని కేరళ రాష్ట్రానకి చెందిన మహిళే. కేరళకు చెందిన సూసీ జెఫ్పీ అనే 36ఏళ్ల మహిళ కొంతకాలంగా సౌదీలో ఉంటున్నారు. ఆమె కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 19న ఆమె ఇంట్లో ఉండగా ఏదో కుట్టినట్లు అనిపించందని తన భర్త జెఫ్పీ మాథ్యూకు చెప్పింది.
చుట్టుపక్కన చీమను గుర్తించిన మాథ్యూ దాన్ని అక్కడి నుంచి తీసి బయట పడేశారు. వెంటనే ఆమె శరీరం వాపు రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆసుపత్రికి తరలించారు. శరీరంపై అలర్జీ ఎక్కువ కావడంతో ఐసీయూలో ఉంచి ప్రత్యేక చికిత్సను అందించారు. తీవ్రంగా కృషి చేసిన వైద్యులు ఆమె ప్రాణాలు కాపాడలేకపోయారు. ఐతే ఆమె మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని డాక్టర్లు చెబుతున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









