ఒకరి ప్రాణాన్ని బలిగొన్న చీమ
- April 04, 2018
సౌదీ అరేబియా: చీమకుట్టి మహిళ చనిపోయిన ఘటన సౌదీ అరేబియాలో చోటుచేసుకుంది. విషపూరితమైన చీమ కుట్టడం వల్ల సౌదీ అరేబియాలో ఓ మహిళ మృతి చెందింది. నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం. ప్రాణాలు కోల్పోయింది మన దేశంలోని కేరళ రాష్ట్రానకి చెందిన మహిళే. కేరళకు చెందిన సూసీ జెఫ్పీ అనే 36ఏళ్ల మహిళ కొంతకాలంగా సౌదీలో ఉంటున్నారు. ఆమె కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 19న ఆమె ఇంట్లో ఉండగా ఏదో కుట్టినట్లు అనిపించందని తన భర్త జెఫ్పీ మాథ్యూకు చెప్పింది.
చుట్టుపక్కన చీమను గుర్తించిన మాథ్యూ దాన్ని అక్కడి నుంచి తీసి బయట పడేశారు. వెంటనే ఆమె శరీరం వాపు రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆసుపత్రికి తరలించారు. శరీరంపై అలర్జీ ఎక్కువ కావడంతో ఐసీయూలో ఉంచి ప్రత్యేక చికిత్సను అందించారు. తీవ్రంగా కృషి చేసిన వైద్యులు ఆమె ప్రాణాలు కాపాడలేకపోయారు. ఐతే ఆమె మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని డాక్టర్లు చెబుతున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి







