సల్మాన్ఖాన్ ను దోషిగా తేల్చిన కోర్టు
- April 04, 2018
ముంబై: కృష్ణ జింకల వేట కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ఖాన్ను జోథ్పూర్ కోర్టు దోషిగా తేల్చింది. మిగతా ఐదుగురు నటులను నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసుకు సంబంధించి మార్చి 28నాటికి తుది వాదనలు పూర్తయ్యాయి. అయితే చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ దేవ్కుమార్ కత్రి తీర్పును వాయిదా వేశారు. ఈరోజు కేసు విచారణకు రాగా సల్మాన్ఖాన్ను కోర్టు దోషిగా తేల్చింది.
1998 అక్టోబర్లో జరిగిన ఓ షూటింగ్ సందర్భంగా జోథ్పూర్ సమీపంలోని కంకణి గ్రామంలో కృష్ణజింకలను హతమార్చినట్లు సల్మాన్పై కేసు నమోదు అయ్యింది. ఇందులో సల్మాన్ ఖాన్పై వన్యప్రాణి సంరక్షణ చట్టం సెక్షన్ 51కింద కేసు నమోదు చేశారు. ఇతర నటులపై సెక్షన్ 149కింద కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో తీర్పు వెల్లడించిన కోర్టు సల్మాన్ను దోషిగా తేల్చుతూ.. మిగతా ఐదుగురు నటులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. జింకల వేట కేసులో ఈరోజు తీర్పు సందర్భంగా సల్మాన్ఖాన్తో పాటు సైఫ్ అలీఖాన్, టబూ, సొనాలిబింద్రే, నీలం తదితరులు జోథ్పూర్ కోర్టుకు చేరుకున్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









