యెమెన్ బోర్డర్లో మిస్సైల్ కూల్చివేత
- April 05, 2018
యెమెన్లో పోరాడుతున్న సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ సేనలు, హౌతీ తీవ్రవాదులు సంధించిన మిస్సైల్ని సౌదీ ఎయిర్ డిఫెన్స్ కూల్చివేసినట్లు పేర్కొన్నాయి. సౌదీ అరామ్కో ఆయిల్ కంపెనీ లక్ష్యంగా ఈ మిస్సైల్ని హౌతీ తీవ్రవాదులు సంధించినట్లు ఓ ప్రకటనలో సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ సేనలు ప్రకటించాయి. మిస్సైల్ కూల్చివేతతో శకలాలు నివాస ప్రాంతాల్లో పడ్డాయి. అరామ్కో సంస్థ, ఈ ఘటనపై స్పందిస్తూ, ఎక్కడా ఎలాంటి ప్రమాదమూ జరగలేదనీ, జిజాన్లో అంతా సేఫ్గా వుందని పేర్కొంది. హౌతీలు మొత్తంగా 107 మిస్సైల్స్నీ, 66,000 ప్రాజెక్టైల్స్ని సౌదీ వైపుగా సంధించాయని సౌదీ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఇరాన్, హౌతీ తీవ్రవాదులకు ఈ మిస్సైల్స్ని అందిస్తోందని సౌదీ ఆరోపిస్తోంది.
తాజా వార్తలు
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్









