యెమెన్ బోర్డర్లో మిస్సైల్ కూల్చివేత
- April 05, 2018
యెమెన్లో పోరాడుతున్న సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ సేనలు, హౌతీ తీవ్రవాదులు సంధించిన మిస్సైల్ని సౌదీ ఎయిర్ డిఫెన్స్ కూల్చివేసినట్లు పేర్కొన్నాయి. సౌదీ అరామ్కో ఆయిల్ కంపెనీ లక్ష్యంగా ఈ మిస్సైల్ని హౌతీ తీవ్రవాదులు సంధించినట్లు ఓ ప్రకటనలో సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ సేనలు ప్రకటించాయి. మిస్సైల్ కూల్చివేతతో శకలాలు నివాస ప్రాంతాల్లో పడ్డాయి. అరామ్కో సంస్థ, ఈ ఘటనపై స్పందిస్తూ, ఎక్కడా ఎలాంటి ప్రమాదమూ జరగలేదనీ, జిజాన్లో అంతా సేఫ్గా వుందని పేర్కొంది. హౌతీలు మొత్తంగా 107 మిస్సైల్స్నీ, 66,000 ప్రాజెక్టైల్స్ని సౌదీ వైపుగా సంధించాయని సౌదీ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఇరాన్, హౌతీ తీవ్రవాదులకు ఈ మిస్సైల్స్ని అందిస్తోందని సౌదీ ఆరోపిస్తోంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







