యూఏఈ:భారత్కు మృతదేహాల తరలింపు ఓ ప్రసహనం
- April 06, 2018
యూఏఈ:యూఏఈలో వలసదారులెవరైనా చనిపోతే, వారిని స్వదేశానికి తరలించడం ఓ ప్రసహనంగా మారిపోతోంది. ఎయిర్స్లైన్స్, మృతదేహాల తరలింపు కోసం డిమాండ్ చేస్తున్న ఛార్జీలు, సామాన్యులను కంటతడిపెట్టిస్తున్నాయి. వివిధ ఎయిర్లైన్స్ 16 దిర్హామ్ల నుంచి 25 దిర్హామ్ల వరకు ఛార్జ్ చేస్తున్నాయి. ఇవి ఒక్కో కిలోగ్రామ్కి చెల్లించాల్సిన ఛార్జీలు. మృతదేహం, అలాగే శవపేటికను కలిపి బరువుని లెక్కిస్తారు. అలా చూస్తే, 2500 దిర్హామ్ల నుంచి 3000 దిర్హామ్ల వరకు మృతదేహం తరలింపుకు ఖర్చవుతోందని ఓ సోషల్ వర్కర్ ఎంఎం నాజర్ కన్హాన్గాడ్ చెప్పారు. భారత రాయబారి నవదీప్ సింగ్ సూరి మాట్లాడుతూ, ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ ద్వారా ఎంబసీ, ఇలాంటి సందర్భాల్లో తగిన సాయం అందజేస్తోందని చెప్పారు. యూఏఈలో 3.5 మిలియన్ వరకు భారత వలసదారులు ఉన్నారని ఆయన చెప్పారు. ఎయిర్లైన్స్ తమ పాలసీని మార్చుకోవాల్సిందిగా సూచించలేమనీ, చెయ్యగలిగినంతమేర తాము బాధితులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తామని వివరించారాయన. ఈ పరిస్థితిపై ప్రధాని నరేంద్రమోడీతో చర్చించనున్నట్లు బీజేపీ కేరళ అధ్యక్షుడు కుమ్మనం రాజశేఖరన్ ఇటీవల యూఏఈ సందర్శించినప్పుడు చెప్పారు.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







