ఫిబ్రవరిలో ఒమన్‌కి వచ్చిన 71,000 మంది క్రూజ్ విజిటర్స్‌

- April 06, 2018 , by Maagulf
ఫిబ్రవరిలో ఒమన్‌కి వచ్చిన 71,000 మంది క్రూజ్ విజిటర్స్‌

మస్కట్‌: ఫిబ్రవరిలో ఒమన్‌కి 71,000 మంది క్రూయిజ్‌ షిప్‌ విజిటర్స్‌ వచ్చారు. ఈ విషయాన్ని ఒమన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ స్టాటిస్టిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ (ఎన్‌సిఎస్‌ఐ) వెల్లడించింది. తన తాజా టూరిజం ఇండెక్స్‌లో ఈ వివరాల్ని ఎన్‌సిఎస్‌ఐ పొందుపర్చింది. క్రూయిజ్‌ టూరిజంకి సంబంధించి ఒమన్‌కి పూర్తి సామర్థ్యం వుంది. అలాగే విజిటర్స్‌ ఒమన్‌ని భద్రత పరంగా అత్యంత మేలైన ప్రాంతంగా భావిస్తుంటారు. దానికి క్రూయిజ్‌ ఓ అందమైన మార్గంగా ఎంచుకుంటుంటారని ట్రావెల్‌ ఏజెంట్‌ ఒకరు చెప్పారు. ఒమన్‌ మినిస్ట్రీ ఆఫ్‌ టూరిజం సైతం, పర్యాటకుల్ని ఆకర్షించేందుకోసం పలు వాటర్‌ స్పోర్టింగ్‌ యాక్టివిటీస్‌ని అందుబాటులో వుంచింది. డైవింగ్‌, సర్ఫిస్త్రంగ్‌ వంటివి సుల్తానేట్‌లోని సుల్తాన్‌ కబూస్‌ పోర్ట్‌, ఖసబ్‌ పోర్ట్‌, సలాలా పోర్ట్‌ క్రూయిజర్స్‌కి అందుబాటులో వున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com