తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త

- April 06, 2018 , by Maagulf
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త

నిరుద్యోగులకు రాష్ట్ర హోమ్ మంత్రి నాయని నరసింహారెడ్డి  శుభవార్త అందించారు. త్వరలో 4 వేల కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నట్టు అయన వెల్లడించారు. ఇందులో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన డీఎస్పీ కార్యాలయాన్ని మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రి హరీష్‌రావు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి నాయిని మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగా త్వరలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com