ట్రంప్ టవర్లో అగ్నిప్రమాదం
- April 07, 2018
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెందిన ట్రంప్ టవర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. నలుగురికి గాయాలైనట్లు సమాచారం. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
న్యూయార్క్లోని ట్రంప్ టవర్ 50వ అంతస్థులో గత రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగారు. హుటాహుటినా భవనంలోని వారిని ఖాళీ చేయించారు. అయితే ప్రమాదంలో 67 ఏళ్ల వృద్ధుడొకరు పొగ కారణంగా ఊపిరాడక స్పృహ కోల్పోగా.. ఆయన్ని ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని అధికారులు వెల్లడించారు. మరోవైపు సహయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది నలుగురు గాయపడినట్లు న్యూయార్క్ పోలీసులు తెలిపారు.
కాగా, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ప్రమాదంపై డొనాల్డ్ ట్రంప్ తన ట్విటర్లో స్పందించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ... సహయక చర్యల్లో పాల్గొన్న సిబ్బందిని ఆయన అభినందించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







