ట్రంప్ టవర్లో అగ్నిప్రమాదం
- April 07, 2018
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెందిన ట్రంప్ టవర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. నలుగురికి గాయాలైనట్లు సమాచారం. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
న్యూయార్క్లోని ట్రంప్ టవర్ 50వ అంతస్థులో గత రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగారు. హుటాహుటినా భవనంలోని వారిని ఖాళీ చేయించారు. అయితే ప్రమాదంలో 67 ఏళ్ల వృద్ధుడొకరు పొగ కారణంగా ఊపిరాడక స్పృహ కోల్పోగా.. ఆయన్ని ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని అధికారులు వెల్లడించారు. మరోవైపు సహయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది నలుగురు గాయపడినట్లు న్యూయార్క్ పోలీసులు తెలిపారు.
కాగా, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ప్రమాదంపై డొనాల్డ్ ట్రంప్ తన ట్విటర్లో స్పందించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ... సహయక చర్యల్లో పాల్గొన్న సిబ్బందిని ఆయన అభినందించారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









