గాజా సరిహద్దుల్లో పాలస్తీనియన్ల కాల్చివేత
- April 07, 2018
గాజా : ఇజ్రాయిల్-గాజా సరిహద్దులో శుక్రవారం ఇజ్రాయిల్ బలగాలు ఏడుగురు పాలస్తీనా ఆందోళనకారులను కాల్చిచంపారని, 200మంది గాయపడ్డారని గాజా మెడికల్ అధికారులు తెలిపారు. దీంతో గత వారం రోజులుగా సాగుతున్న నిరసనలు, ఆందోళనల్లో మృతిచెందిన వారి సంఖ్య 27కి చేరుకుంది. మృతుల్లో 16, 17ఏళ్ళ వయస్సున్న ఇద్దరు టీనేజీ పిల్లలు వున్నారని వారు తెలిపారు. 'ది గ్రేట్ మార్చ్ ఆఫ్ రిటర్న్' పేరుతో రోజువారీ సాగుతున్న ఈ ఆందోళనల సందర్భంగా శుక్రవారం హింసాకాండ చెలరేగడంతో వీరు మరణించారు.
గత శుక్రవారం నిరసనలు, ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. దాదాపు 20వేల మంది పాల్గొన్నట్లు ఇజ్రాయిల్ మిలటరీ అంచనా వేసింది. వీరందరూ కూడా ఇజ్రాయిల్లోని తమ ఇళ్ళకు తిరిగి వెళ్ళాలనుకుంటున్నారు. గాజా నుండి ఇజ్రాయిల్ను వేరు చేస్తున్న కంచెకు 65కిలోమీటర్ల దూరంలో శిబిరాలు వేసుకుని వీరు ఆందోళన నిర్వహిస్తున్నారు. 'మా వద్ద నుండి ఇజ్రాయిల్ ప్రతి ఒక్కటీ లాగేసుకుంది. మా మాతృభూమిని, స్వేచ్ఛను, మా భవితవ్యాన్ని వారు లాక్కున్నారు' అని ఆందోళనకారులు విమర్శించారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







