కామన్వెల్త్ గేమ్స్: నాలుగో స్థానంలో భారత్
- April 07, 2018
కామన్వెల్త్ గేమ్స్ లో భారత వెయిట్ లిఫ్టర్ల హవా కొనసాగుతుండటంతో పథకాల పట్టికలో భారత్ ఇప్పటివరకు టాప్ 5లో ఉంది. ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్లో జరుగుతున్న 21వ ఎడిషన్ కామన్వెల్త్ గేమ్స్లో మూడో రోజు ముగిసే సరికి భారత్ నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్య పతకంతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. 56 కేజీల విభాగంలో పి.గురురాజ రజత పతకం, 69 కేజీల విభాగంలో హరియాణాకు చెందిన దీపక్ లాథర్ కాంస్య పతకం సాధించాడు. భారత వెయిట్ లిఫ్టర్లు సతీశ్ శివలింగం, వెంకట్ రాహుల్ భారత్కు రెండు స్వర్ణ పతకాలు సాధించి పెట్టారు. మిజోరంకు చెందిన మహిళా వెయిట్ లిఫ్టర్ సంజిత చాను 53వ కేజీల విభాగంలో స్వర్ణం సాధించింది. ఇక మిరాబాయ్ చాను కూడా స్వర్ణం సాధించడంతో భారత్ మొత్తం నాలుగు స్వర్ణ పతకాలతో నాలుగో స్థానంలో ఉంది.
అయితే ఇక్కడ భారత్ సాధించిన మొత్తం ఆరు పతకాలు వెయిట్ లిఫ్టర్లు సాధించనవే కావడం గమనార్హం. పతకాల పట్టికలో ఆస్ట్రేలియా 57పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. 32 పతకాలతో రెండో స్థానంలో ఇంగ్లండ్, 18 పతకాలతో కెనడా మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. ఇక భారత్ ఆరు పతకాలతో నాలుగో స్థానంలో ఉంది.
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







