కామన్వెల్త్ గేమ్స్: నాలుగో స్థానంలో భారత్
- April 07, 2018
కామన్వెల్త్ గేమ్స్ లో భారత వెయిట్ లిఫ్టర్ల హవా కొనసాగుతుండటంతో పథకాల పట్టికలో భారత్ ఇప్పటివరకు టాప్ 5లో ఉంది. ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్లో జరుగుతున్న 21వ ఎడిషన్ కామన్వెల్త్ గేమ్స్లో మూడో రోజు ముగిసే సరికి భారత్ నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్య పతకంతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. 56 కేజీల విభాగంలో పి.గురురాజ రజత పతకం, 69 కేజీల విభాగంలో హరియాణాకు చెందిన దీపక్ లాథర్ కాంస్య పతకం సాధించాడు. భారత వెయిట్ లిఫ్టర్లు సతీశ్ శివలింగం, వెంకట్ రాహుల్ భారత్కు రెండు స్వర్ణ పతకాలు సాధించి పెట్టారు. మిజోరంకు చెందిన మహిళా వెయిట్ లిఫ్టర్ సంజిత చాను 53వ కేజీల విభాగంలో స్వర్ణం సాధించింది. ఇక మిరాబాయ్ చాను కూడా స్వర్ణం సాధించడంతో భారత్ మొత్తం నాలుగు స్వర్ణ పతకాలతో నాలుగో స్థానంలో ఉంది.
అయితే ఇక్కడ భారత్ సాధించిన మొత్తం ఆరు పతకాలు వెయిట్ లిఫ్టర్లు సాధించనవే కావడం గమనార్హం. పతకాల పట్టికలో ఆస్ట్రేలియా 57పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. 32 పతకాలతో రెండో స్థానంలో ఇంగ్లండ్, 18 పతకాలతో కెనడా మూడో స్థానంలో కొనసాగుతున్నాయి. ఇక భారత్ ఆరు పతకాలతో నాలుగో స్థానంలో ఉంది.
తాజా వార్తలు
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్తో భేటీ అయిన నెతన్యాహు..
- బిగ్ టికెట్ మూడో వారపు ఈ-డ్రాలో నలుగురికి Dh 25 వేల చొప్పున నగదు బహుమతి
- ఎమిరేట్స్లో ఇక క్రిప్టో చెల్లింపులు..Crypto.com Pay ద్వారా విమాన టికెట్ల బుకింగ్కు అవకాశం
- కార్మికుల కోసం 'షేడ్ అండ్ రివార్డ్' కార్యక్రమం ఆరో వారం..
- తెలంగాణకు 11.56 లక్షల పీఎంఏవై-జీ ఇళ్ల కేటాయింపు కోరిన సీఎం రేవంత్
- కేంద్ర రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి..
- మలబార్ గోల్డ్ & డైమండ్స్ బ్రాండ్ అంబాసడర్గా ఎంఎస్ ధోనీ
- భారత బొమ్మల పరిశ్రమకు కేంద్రం భారీ ప్రోత్సాహం: ఎంపీ బాలశౌరి
- జీఎంఆర్ ఏరో టెక్నిక్–హనీవెల్ ఏరోస్పేస్ వ్యూహాత్మక ఒప్పందం
- యూరప్కు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా జయ్ కుమార్ గుంటుపల్లి...







