ఉత్తరాఖండ్కు పొంచి ఉన్న ముప్పు
- April 08, 2018
హిమాలయాలకు సమీపంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని పెనుభూకంపం అతలాకుతలం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండేళ్లుగా స్వల్ప స్థాయిలో సంభవిస్తున్న భూకంపాలు దీన్నే హెచ్చరిస్తున్నాయని నిపుణులు తెలిపారు. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 8కి పైగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఉత్తరాఖండ్లో త్వరలోనే అత్యంత భారీ భూకంపం విధ్వంసం సృష్టించనుందని ఆ రాష్ట్ర విపత్తు ఉపశమనం, నిర్వహణా కేంద్రం (డీఎంఎంసీ) చీఫ్ పీయూష్ రౌతేలా తెలిపారు.
2015 నుంచి జనవరి 1 వరకు రాష్ట్రంలో 51 సార్లు భూమి స్వల్పంగా కంపించిందని.. వీటిని హెచ్చరికలుగానే పరిగణించాల్సి ఉంటుందన్నారు. ఉత్తరాఖండ్లో గత 200 ఏళ్లుగా ఏ ఒక్క భారీ భూకంపం సంభవించలేదన్నారు. ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాలు అత్యంత తీవ్రమైన భూకంపాలు సంభవించే జోన్-5లో ఉన్నాయన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. రిక్టర్ స్కేలుపై 7 తీవ్రతతో భూకంపం వస్తే ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన ముస్సోరీలో 18 శాతం, నైనిటాల్లో 14 శాతం భవంతులు నేలమట్టమవుతాయని అన్నారు. ఇక్కడి భవంతుల్లో చాలావరకూ 1951కి ముందు నిర్మితమమైనవే. 1803లో చివరిసారిగా సంభవించిన భూకంపంతో ఉత్తారఖండ్ అతలాకుతలమైంది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







