ఇబ్రి-యాంకుల్ రోడ్: 17 కిలోమీటర్ల సెక్షన్ ప్రారంభించిన ఎంఓటీసీ
- April 09, 2018
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ (ఎంఓటీసీ), ఇబ్రి - యాంకుల్ రోడ్కి సంబంధించి 17 కిలోమీటర్ల సెక్షన్ (సెకెండ్ స్టేజ్)ని ప్రారంభించింది.మినిస్ట్రీ అండర్ సెక్రెటరీ ఇంజనీర్ సలీమ్ బిన్ మొహమ్మద్ అల్ నౌమి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. దహిరాహ్ గవర్నర్ షేక్ సైఫ్ బిన్ హిమియార్ అల్ మాలిక్ అల్ షుభి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఖదాల్ ఏరియా - విలాయత్ ఆఫ్ ఇబ్రి నుంచి అల్ ఎక్దా ఏరియా - యాంకుల్ వరకు 10 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు విస్తరించి వుంది. దహిర్ అల్ ఫవారిస్ రౌండెంబౌట్ నుంచి సయ్యా రౌండెబౌట్ వరకు మరో 7 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరించి వుంది. మొత్తం 34 కిలోమీటర్ల ఇబ్రి - యాంకుల్ రోడ్లో 22 కిలోమీటర్ల మేర రోడ్డు ప్రారంభమయ్యింది. తొలి స్టేజ్లో 4.8 కిలోమీటర్ల రోడ్డు గతంలోనే ప్రారంభమయ్యింది. మొత్తం 10 రౌండెబౌట్స్, మూడు పెడెస్ట్రియన్ టన్నెల్స్ ఇందులో వున్నాయి. అల్ అరిధ్, ఖదాల్, మాజ్జె, అల్ మహియూల్, అల్ దువామ్రియా, సయ్యి ప్రాంతాలకు ఈ రోడ్డు ఉపయుక్తంగా వుంటుంది. దహిరాహ్ గవర్నరేట్ పరిధిలో టూరిజం, ట్రేడ్ మరియు సోషల్ మూమెంట్స్ ఈ రహదారి కారణంగా విస్తరిస్తాయని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







