ఇబ్రి-యాంకుల్ రోడ్: 17 కిలోమీటర్ల సెక్షన్ ప్రారంభించిన ఎంఓటీసీ
- April 09, 2018
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ (ఎంఓటీసీ), ఇబ్రి - యాంకుల్ రోడ్కి సంబంధించి 17 కిలోమీటర్ల సెక్షన్ (సెకెండ్ స్టేజ్)ని ప్రారంభించింది.మినిస్ట్రీ అండర్ సెక్రెటరీ ఇంజనీర్ సలీమ్ బిన్ మొహమ్మద్ అల్ నౌమి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. దహిరాహ్ గవర్నర్ షేక్ సైఫ్ బిన్ హిమియార్ అల్ మాలిక్ అల్ షుభి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఖదాల్ ఏరియా - విలాయత్ ఆఫ్ ఇబ్రి నుంచి అల్ ఎక్దా ఏరియా - యాంకుల్ వరకు 10 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు విస్తరించి వుంది. దహిర్ అల్ ఫవారిస్ రౌండెంబౌట్ నుంచి సయ్యా రౌండెబౌట్ వరకు మరో 7 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరించి వుంది. మొత్తం 34 కిలోమీటర్ల ఇబ్రి - యాంకుల్ రోడ్లో 22 కిలోమీటర్ల మేర రోడ్డు ప్రారంభమయ్యింది. తొలి స్టేజ్లో 4.8 కిలోమీటర్ల రోడ్డు గతంలోనే ప్రారంభమయ్యింది. మొత్తం 10 రౌండెబౌట్స్, మూడు పెడెస్ట్రియన్ టన్నెల్స్ ఇందులో వున్నాయి. అల్ అరిధ్, ఖదాల్, మాజ్జె, అల్ మహియూల్, అల్ దువామ్రియా, సయ్యి ప్రాంతాలకు ఈ రోడ్డు ఉపయుక్తంగా వుంటుంది. దహిరాహ్ గవర్నరేట్ పరిధిలో టూరిజం, ట్రేడ్ మరియు సోషల్ మూమెంట్స్ ఈ రహదారి కారణంగా విస్తరిస్తాయని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్







