ఇబ్రి-యాంకుల్ రోడ్: 17 కిలోమీటర్ల సెక్షన్ ప్రారంభించిన ఎంఓటీసీ
- April 09, 2018
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ (ఎంఓటీసీ), ఇబ్రి - యాంకుల్ రోడ్కి సంబంధించి 17 కిలోమీటర్ల సెక్షన్ (సెకెండ్ స్టేజ్)ని ప్రారంభించింది.మినిస్ట్రీ అండర్ సెక్రెటరీ ఇంజనీర్ సలీమ్ బిన్ మొహమ్మద్ అల్ నౌమి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. దహిరాహ్ గవర్నర్ షేక్ సైఫ్ బిన్ హిమియార్ అల్ మాలిక్ అల్ షుభి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఖదాల్ ఏరియా - విలాయత్ ఆఫ్ ఇబ్రి నుంచి అల్ ఎక్దా ఏరియా - యాంకుల్ వరకు 10 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు విస్తరించి వుంది. దహిర్ అల్ ఫవారిస్ రౌండెంబౌట్ నుంచి సయ్యా రౌండెబౌట్ వరకు మరో 7 కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరించి వుంది. మొత్తం 34 కిలోమీటర్ల ఇబ్రి - యాంకుల్ రోడ్లో 22 కిలోమీటర్ల మేర రోడ్డు ప్రారంభమయ్యింది. తొలి స్టేజ్లో 4.8 కిలోమీటర్ల రోడ్డు గతంలోనే ప్రారంభమయ్యింది. మొత్తం 10 రౌండెబౌట్స్, మూడు పెడెస్ట్రియన్ టన్నెల్స్ ఇందులో వున్నాయి. అల్ అరిధ్, ఖదాల్, మాజ్జె, అల్ మహియూల్, అల్ దువామ్రియా, సయ్యి ప్రాంతాలకు ఈ రోడ్డు ఉపయుక్తంగా వుంటుంది. దహిరాహ్ గవర్నరేట్ పరిధిలో టూరిజం, ట్రేడ్ మరియు సోషల్ మూమెంట్స్ ఈ రహదారి కారణంగా విస్తరిస్తాయని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!









