ఇటలీలో 4.7తీవ్రతతో భూకంపం
- April 10, 2018
రోమ్: ఇటలీలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టారు స్కేలుపై 4.7 తీవ్రతతో ఇటలీలో సంభవించిన ఈ భూకంపం కారణంగా స్వల్ప ఆస్తి నష్టం జరిగిందని స్థానిక అధికారులు తెలిపారు.
ప్రజలెవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. మార్చి ప్రాంతంలోని మక్కాయాలో ఈ భూకంప ప్రభావం ఎక్కువగా కనిపించిందని తెలిపారు. భూమి కంపించడంతో ఆందోళనకు గురైన ప్రజలు తమ నివాసాల నుంచి బయటికి పరుగులు తీశారని చెప్పారు.
కాగా, 2016లో సంభవించిన భారీ భూకంపంతో భారీ ప్రాణ నష్టం జరిగింది. ఈ భూకంపం తీవ్రత 6.2ఉండటంతో సుమారు 300లకు పైగా ప్రజలు మృత్యువాత పడ్డారు. వేలాది మంది గాయాలపాలయ్యారు. అనేక మంది తమ నివాసాలను కోల్పోయి నిరాశ్రయులయ్యారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







