ఇటలీలో 4.7తీవ్రతతో భూకంపం
- April 10, 2018
రోమ్: ఇటలీలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టారు స్కేలుపై 4.7 తీవ్రతతో ఇటలీలో సంభవించిన ఈ భూకంపం కారణంగా స్వల్ప ఆస్తి నష్టం జరిగిందని స్థానిక అధికారులు తెలిపారు.
ప్రజలెవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. మార్చి ప్రాంతంలోని మక్కాయాలో ఈ భూకంప ప్రభావం ఎక్కువగా కనిపించిందని తెలిపారు. భూమి కంపించడంతో ఆందోళనకు గురైన ప్రజలు తమ నివాసాల నుంచి బయటికి పరుగులు తీశారని చెప్పారు.
కాగా, 2016లో సంభవించిన భారీ భూకంపంతో భారీ ప్రాణ నష్టం జరిగింది. ఈ భూకంపం తీవ్రత 6.2ఉండటంతో సుమారు 300లకు పైగా ప్రజలు మృత్యువాత పడ్డారు. వేలాది మంది గాయాలపాలయ్యారు. అనేక మంది తమ నివాసాలను కోల్పోయి నిరాశ్రయులయ్యారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









