దుబాయ్లో స్మార్ట్ ఎయిర్పోర్ట్ టన్నెల్ అతి త్వరలో
- April 10, 2018
దుబాయ్: దుబాయ్ ఎయిర్ పోర్&్ట్స, స్మార్ట్ టన్నెల్ని త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మే నెలాఖరుకు ఇది అందుబాటులోకి వస్తుంది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు ఫారిన్ ఎఫైర్స్ - దుబాయ్ (జిడిఆర్ఎఫ్ఎ) డైరెక్టర్మేజర్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మెర్రి మాట్లాడుతూ దుబాయ్లో పాస్పోర్ట్ కంట్రోల్కి సంబంధించి ఇది కీలకమైన ముందడుగుగా అభివర్ణించారు. ప్రస్తుతం ఈ టన్నెల్ ప్రయోగాత్మక దశలో వుందని చెప్పారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ టన్నెల్ పనిచేస్తుంది. గత ఏడాది జిటెక్స్ టెక్నాలజీ వీక్లో ఈ స్మార్ట్ టన్నెల్ని ఆవిష్కరించారు. బయోమెట్రిక్ సిస్టమ్ ఇందులో కీలకం. ప్రయాణీకులు ఏమీ చెయ్యకుండానే ఈ టన్నెల్ ద్వారా ప్రయాణించొచ్చు. పాస్పోర్ట్ని చూపించాల్సిన అవసరం లేదు. ఇది ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. కేవలం 10 సెకెన్లలోనే పని పూర్తి చేస్తుంది. టన్నెల్ ముందు ప్రయాణీకులు నిల్చుంటే ఫేస్ రికగ్నిషన్ ద్వారా మిగతా పనులు పూర్తయిపోతాయి. ఆ తర్వాత టన్నెల్ నుంచి ఎగ్జిట్ అవ్వొచ్చు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









