గర్భిణీ అయిన ఓ పాకిస్తానీ గాయని హత్య

- April 11, 2018 , by Maagulf
గర్భిణీ అయిన ఓ పాకిస్తానీ గాయని హత్య

ఇస్లామాబాద్‌ : గర్భిణీ అయిన ఓ పాకిస్తానీ గాయని హత్యకు గురైంది. ఈ సంఘటన దక్షిణ సింధ్‌ ప్రావిన్స్‌లోని లార్కానా జిల్లా కంగా గ్రామంలో జరిగింది. వేదికపై పాడుతున్నప్పుడు ఓ వ్యక్తి తను చెప్పినట్లు చేయకపోవడంతో కోపంతో తన వద్ద నున్న గన్‌తో కాల్చి చంపాడు. ఈ సంఘటనతో అక్కడి వారందరూ ఉలిక్కిపడ్డారు. మృతురాలు సమీనా సామూన్‌ అలియాస్‌ సమీనా సింధు(24) ఆరు నెలల గర్భవతి అని ఆమె భర్త తెలిపారు.

సంఘటన జరిగిన వెంటనే ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన డాక్టర్లు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. నిందితుడు తారిఖ్‌ అహ్మెద్‌ జాతోయ్‌ మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు తారిఖ్‌ను అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com